ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఫోన్ ట్యాపింగ్ కేసులో డీఎస్పీ దుగ్యాల ప్రణీత్ రావుపై ప్రభుత్వం చర్యలు

Telangana Telugu |  Suryaa Desk  | Published : Wed, Feb 04, 2026, 03:38 PM

ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. అక్రమంగా ట్యాపింగ్ కు పాల్పడ్డారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న నిందితుడు డీఎస్పీ దుగ్యాల ప్రణీత్ రావుపై ప్రభుత్వం చర్యలు తీసుకుంది. బీఆర్ఎస్ ప్రభుత్వం ఆయనకు కల్పించిన యాక్సిలరేటెడ్ ప్రమోషన్, తద్వారా ఆయన పొందిన డీఎస్పీ హోదాను రద్దు చేసింది. ఇకపై ఆయన ఇన్ స్పెక్టర్ గానే కొనసాగుతారంటూ హోంశాఖ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సి.వి.ఆనంద్‌ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ వ్యవహారానికి సంబంధించిన క్రిమినల్ కేసులో ప్రణీత్ ప్రస్తుతం జైలులో ఉన్న విషయం తెలిసిందే.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa