ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం సందర్భంగా సంగారెడ్డి జిల్లా ప్రభుత్వ జనరల్ హాస్పిటల్ లో బుధవారం నర్సింగ్ సిబ్బంది, విద్యార్థులు, రోగులు, సహాయకులకు క్యాన్సర్ పై అవగాహన కల్పించారు. వయసుతో సంబంధం లేకుండా వచ్చే ఈ మహమ్మారి నివారణకు ఆహారపు అలవాట్లు, చెడు వ్యసనాలు, పొగాకు, ప్లాస్టిక్ లో నిల్వ ఉంచిన పదార్థాలు తినడం వంటివి కారణమవుతాయని నర్సింగ్ కళాశాల విద్యార్థినులు శిల్పా రాణి, రేణుక చార్టుల ద్వారా వివరించారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ పద్మ, సిబ్బంది, ఆరోగ్యశ్రీ సిబ్బంది హిమగిరి ప్రసాద్ పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa