నల్గొండ జిల్లా, నకిరేకల్ నియోజకవర్గం, చిట్యాల మండలం ఏపూరు గ్రామానికి చెందిన వలిగొండ నర్సింహ, ఉస్మానియా యూనివర్సిటీ నుంచి పొలిటికల్ సైన్స్ విభాగంలో డాక్టరేట్ పట్టా పొందారు. ఈ సందర్భంగా, ది జాతీయ వినియోగదారుల హక్కుల కమిషన్ డిప్యూటీ చైర్మన్ యంగలి గోపి గౌడ్ ఆయనను సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. నిరుపేద కుటుంబంలో జన్మించి, చదువును ఆయుధంగా చేసుకుని ఎదిగిన నరసింహ జీవితం ప్రేరణాత్మకమని గోపి గౌడ్ అన్నారు. ఈ కార్యక్రమంలో విద్యార్థి నాయకుడు మనోజ్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa