ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఢిల్లీ లిక్కర్ కేసులో కవితకు ఊరట లభించడంపై అలేఖ్య హర్షం

Telangana Telugu |  Suryaa Desk  | Published : Sun, Mar 01, 2026, 10:35 PM

ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవితకు కోర్టు నుంచి భారీ ఊరట లభించిన విషయం తెలిసిందే. ఈ పరిణామం పట్ల ఆమె సన్నిహితులు, కుటుంబ సభ్యులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే దివంగత నందమూరి తారకరత్న అర్ధాంగి అలేఖ్య రెడ్డి.. కవితను స్వయంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. కవిత కుటుంబ సభ్యులతో కలిసి ఆమె విజయోత్సవంలో పాల్గొన్నారు.ఈ సందర్భంగా అలేఖ్య రెడ్డి తన ఇన్ స్టాగ్రామ్ ఖాతాలో కవితతో దిగిన ఫోటోను షేర్ చేస్తూ ఒక ఆసక్తికరమైన పోస్ట్ పెట్టారు.నీ విజయం పట్ల చాలా సంతోషంగా ఉంది. నువ్వు నిరూపించుకున్నావ్ నిజం వైపు నిలబడ్డావు చివరకు సాధించావు అంటూ అలేఖ్య రాసుకొచ్చారు. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.గతంలోనూ అలేఖ్య రెడ్డి కల్వకుంట్ల కవితతో తనకున్న సుదీర్ఘ అనుబంధం గురించి సోషల్ మీడియాలో ప్రస్తావించారు. తమ స్నేహం గత 20 ఏళ్లుగా కొనసాగుతోందని, ఈ ప్రయాణంలో ఎన్నో ఆటుపోట్లు వచ్చినప్పటికీ తమ బంధం చెక్కుచెదరలేదని తెలిపారు. కవిత అంటే తనకు ఎంతో అభిమానమని, తామిద్దరం ఎప్పుడూ కలిసిమెలిసి ఉంటామని పేర్కొన్నారు. భవిష్యత్తులోనూ తమ స్నేహం ఇలాగే కొనసాగాలని అలేఖ్య ఆకాంక్షించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa