ట్రెండింగ్
Epaper    English    தமிழ்

యుద్ధ నేపథ్యంలో విదేశాల్లో చిక్కుకున్న వారిని భారత్ కి తరలించేందుకు ప్రత్యేక విమాన సర్వీసులు

Telangana Telugu |  Suryaa Desk  | Published : Tue, Mar 03, 2026, 02:26 PM

ఇరాన్-అమెరికా మధ్య నెలకొన్న యుద్ధ వాతావరణంతో పశ్చిమాసియా దేశాల్లో చిక్కుకుపోయిన భారతీయులకు కేంద్ర ప్రభుత్వం ఊరట కల్పించింది. మూడు రోజులుగా నిలిచిపోయిన విమాన రాకపోకలను మంగళవారం నుంచి పాక్షికంగా పునరుద్ధరించారు. జెడ్డా, మస్కట్, అబుదాబి వంటి నగరాల నుంచి భారత్‌కు ప్రత్యేక విమాన సర్వీసులు ప్రారంభం కావడంతో ప్రవాసుల కుటుంబాల్లో ఆందోళన తగ్గింది.గల్ఫ్‌లో చిక్కుకున్న తమ పౌరులను సురక్షితంగా రప్పించేందుకు కేంద్ర ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సహా పలు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా అప్రమత్తమయ్యాయి. తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఇప్పటికే కేంద్ర విదేశాంగ శాఖతో సంప్రదింపులు జరిపారు. ఢిల్లీలోని ఏపీ, తెలంగాణ భవన్‌లలో ప్రత్యేక కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు చేసి, బాధితుల కుటుంబాలకు ఎప్పటికప్పుడు సమాచారం అందిస్తున్నారు.ఇండిగో సంస్థ జెడ్డా నుంచి హైదరాబాద్, ముంబై, ఢిల్లీకి 10 ప్రత్యేక విమానాలను నడుపుతోంది. ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ కూడా మస్కట్ నుంచి కొచ్చి, ఢిల్లీ, ముంబై సహా పలు నగరాలకు సర్వీసులను పునరుద్ధరించింది. ఎమిరేట్స్, ఎతిహాద్ వంటి సంస్థలు దుబాయ్, అబుదాబి నుంచి పరిమిత సంఖ్యలో విమానాలు నడుపుతున్నాయి. ఇప్పటికే కొన్ని విమానాలు ఢిల్లీ, బెంగళూరులో ల్యాండ్ అయినట్లు అధికారులు తెలిపారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa