ఎండాకాలం మొదలైంది. మార్చి మొదటి వారం నుంచే భానుడి భగభగలు తట్టుకోలేక జనం అవస్థలు పడుతున్నారు. ఈ క్రమంలోనే విద్యుత్ వినియోగం కూడా పెరిగిపోతోంది. తెలంగాణలో విద్యుత్ డిమాండ్ క్రమంగా పెరుగుతోంది. ఈ నేపథ్యంలోనే గతంలో ఎన్నడూ లేనంతగా విద్యుత్ వినియోగిస్తున్నారు. ఇళ్లు, పరిశ్రమలతోపాటు.. వేసవి కాలంలో పంటలకు కూడా విద్యుత్ వినియోగం భారీగా పెరుగుతోంది. దీంతో రికార్డు స్థాయిలో విద్యుత్ డిమాండ్ నెలకొంది. అయితే డిమాండ్కు తగ్గట్లు విద్యుత్ అధికారులు నిరంతరం.. విద్యుత్ సరఫరా అందిస్తున్నారు.
ఈ క్రమంలోనే తెలంగాణ రాష్ట్ర చరిత్రలోనే అత్యధిక విద్యుత్ వినియోగం మంగళవారం గరిష్ఠ స్థాయికి చేరుకుంది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మంగళవారం రోజున 18,139 మెగావాట్ల విద్యుత్ వినియోగం జరిగినట్లు విద్యుత్ శాఖ అధికారులు లెక్కలు వెల్లడించారు. దీనిపై స్పందించిన.. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క .. భవిష్యత్లో రాష్ట్రవ్యాప్తంగా అవసరమైన విద్యుత్ను అందించేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. రాష్ట్రంలో డిమాండ్కు అనుగుణంగా విద్యుత్ సరఫరా జరుగుతున్నట్లు వివరించారు. ఈ క్రమంలోనే రోజురోజుకూ భారీగా విద్యుత్ డిమాండ్ పెరుగుతున్నప్పటికీ.. ఎలాంటి అంతరాయం లేకుండా సరఫరా చేస్తున్నందుకు విద్యుత్ శాఖ సిబ్బందిని భట్టి విక్రమార్క అభినందించారు.
వేసవి కాలంలో ఉష్ణోగ్రతలు భారీగా పెరుగుతుండటం.. దీంతో వ్యవసాయానికి విద్యుత్ మరింత ఎక్కువగా అవసరం అవుతోంది. ఈ క్రమంలోనే రాష్ట్రంలో రోజురోజుకీ విద్యుత్ డిమాండ్ పెరుగుతోంది. రాష్ట్రంలో పంట సాగు విస్తీర్ణం పెరగడంతో పాటు పారిశ్రామిక అవసరాలకు విద్యుత్ వినియోగం పెరుగుతుండటం కూడా విద్యుత్ డిమాండ్ అధికం అవుతోందని విద్యుత్ శాఖ అధికారులు వెల్లడించారు.
తెలంగాణలో విద్యుత్ వినియోగం రికార్డు స్థాయికి చేరుకోవడం అంటే.. రాష్ట్ర ఆర్థిక వృద్ధికి, కార్యనిర్వహణకు నిదర్శనం అని భట్టి విక్రమార్క తెలిపారు. భౌగోళికంగా తెలంగాణ చిన్న రాష్ట్రమే అయినప్పటికీ.. పెద్ద రాష్ట్రాలతో సమానంగా విద్యుత్ సరఫరా చేస్తుండటం గర్వకారణమని పేర్కొ్న్నారు. వ్యవసాయ, పారిశ్రామిక, పట్టణాభివృద్ధిలో తెలంగాణ దూసుకెళ్తుందని.. ఈ విద్యుత్ వినియోగమే చెబుతోందని భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. రాష్ట్రంలో ఐటీ, ఔషధ తయారీ, నీటి ప్రాజెక్టుల విస్తరణతో విద్యుత్ వినియోగం భారీగా పెరిగిందని వివరించారు.
దేశంలో అతిపెద్ద రాష్ట్రాలైన మధ్యప్రదేశ్ 19,900 మెగావాట్లు.. రాజస్థాన్ 20,600 మెగావాట్ల విద్యుత్ డిమాండ్ ఉండగా.. చిన్న రాష్ట్రమైన తెలంగాణ 18,139 మెగావాట్ల డిమాండ్తో ఆ దరిదాపుల్లో నిలిచిందని.. ఇదే జాతీయ స్థాయిలో రాష్ట్రం సాధించిన ఘనత అని పేర్కొన్నారు. పరిశ్రమలు అత్యధికంగా ఉన్న రాష్ట్రాలైన పంజాబ్, హర్యానా, జార్ఖండ్, ఛత్తీస్గఢ్ల కంటే తెలంగాణ ఎక్కువ విద్యుత్ డిమాండ్ను నమోదు చేయడం విశేషమని చెప్పారు. 2023-24లో తెలంగాణ విద్యుత్ వినియోగం.. 15,623 మెగావాట్లు ఉండగా.. అది ఇప్పుడు 18,139 మెగావాట్లకు చేరుకుందని స్పష్టం చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa