TG:రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలానికి చెందిన ఓ యువతి, ఇన్స్టాగ్రామ్లో పరిచయమైన ప్రియుడి కోరిక మేరకు తన తల్లి బంగారాన్ని అమ్మి, అతనికి బైక్ను బహుమతిగా ఇచ్చింది. డబ్బులు లేకపోవడంతో యువతి ఈ పని చేసినట్లు తెలుస్తోంది. ఇంట్లో బంగారం కనిపించకపోవడంతో తల్లి పోలీసులను ఆశ్రయించడంతో ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసులు ప్రస్తుతం ఈ ఘటనపై విచారణ జరుపుతున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa