జగిత్యాల జిల్లా మల్యాల మండలం తాటిపల్లి గ్రామంలో శ్రీ శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారి విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవం అంగరంగ వైభవంగా ఆదివారం జరిగింది. ఈ సందర్భంగా ఆలయాన్ని జగిత్యాల డీఎస్పీ రఘు చందర్ దర్శించుకున్నారు. రొటీగూడం శ్రీ శ్రీ హరి మౌనస్వామీ కారములచే స్వామి వారి విగ్రహ ప్రతిష్టాపన జరిగింది. ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ లక్ష్మణ చారి, శ్రీకోటి శ్రీకాంత్, ఐల్లా సత్యం పాల్గొన్నారు. విగ్రహ ప్రతిష్టాపన సందర్భంగా జంటలచే మహా హోమం, అన్న ప్రసన్న కార్యక్రమాలు నిర్వహించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa