ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ప్రజలందరికీ ఆరోగ్యాన్ని కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం

Telangana Telugu |  Suryaa Desk  | Published : Wed, Mar 25, 2026, 10:40 AM

తెలంగాణ ప్రభుత్వం ప్రజలందరికీ ఆరోగ్యాన్ని అందించే లక్ష్యంతో పనిచేస్తోందని చౌటుప్పల్ మున్సిపల్ చైర్ పర్సన్ మొగుదాల పావని రమేష్ గౌడ్ తెలిపారు. 'ప్రజా పాలన - ప్రగతి ప్రణాళిక' కార్యక్రమంలో భాగంగా, మంగళవారం చౌటుప్పల్ మున్సిపాలిటిలోని తంగడపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఏర్పాటు చేసిన ఉచిత మెగా హెల్త్ క్యాంపును ఆమె ప్రారంభించారు. ఈ వైద్య శిబిరంలో గైనకాలజీ, జనరల్ మెడిసిన్ విభాగాల వైద్యులు ప్రజలకు ఉచితంగా పరీక్షలు నిర్వహించి, అవసరమైన వారికి మందులను పంపిణీ చేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa