జోగులాంబ గద్వాల జిల్లా వీరాపురం వద్ద సోమవారం మధ్యాహ్నం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కారు అదుపుతప్పి రోడ్డు పక్కన ఉన్న చెట్టును ఢీకొనడంతో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఇంతియాజ్ (26) అనే యువకుడు అక్కడికక్కడే మృతి చెందగా, మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. గోవా నుంచి నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ తాలూకా పెంట్లవెల్లికి ప్రయాణిస్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగినట్లు స్థానికులు తెలిపారు. ప్రమాదానికి గల కారణాలపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa