తెలంగాణలో ఎండలు తీవ్రంగా ఉన్నాయి, ఉష్ణోగ్రతలు 45 డిగ్రీలు దాటుతున్నాయి. రానున్న ఐదు రోజుల్లో మరో 2-3 డిగ్రీలు పెరిగే అవకాశం ఉందని వాతావరణశాఖ అంచనా వేసింది. సోమవారం వడదెబ్బతో నలుగురు మృతి చెందారు. వడదెబ్బ మరణాలకు తెలంగాణ ప్రభుత్వం రూ.4 లక్షల పరిహారం అందిస్తోంది. ఈ పరిహారం పొందడానికి పోస్ట్ మార్టం రిపోర్ట్, ఎఫ్ఐఆర్ కాపీ, వాతావరణశాఖ ధృవీకరణ పత్రాలు, డెత్ సర్టిఫికేట్, ఆధార్, బ్యాంక్ పాస్ బుక్, కుటుంబ సభ్యుల డిక్లరేషన్ వంటి పత్రాలు సమర్పించాల్సి ఉంటుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa