ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కొత్త ప్రిన్సిపల్‌ సీసీఐటీగా బాధ్యతలు చేపట్టిన బత్తిని సురేష్

Telangana Telugu |  Suryaa Desk  | Published : Wed, Apr 15, 2026, 01:52 PM

సీనియర్ ఐఆర్‌ఎస్ అధికారి బత్తిని సురేశ్ తెలుగు రాష్ట్రాల ప్రిన్సిపల్ చీఫ్ కమిషనర్‌గా బాధ్యతలు స్వీకరించారు. కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు (సీబీడీటీ) గత గురువారం ఆయన నియామక ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో ఆయన ఇవాళ బాధ్యతలు చేపట్టారు. బత్తిని సురేశ్‌కు గతంలో హైదరాబాద్ రీజియన్‌లో ఆదాయ పన్ను శాఖ చీఫ్ కమిషనర్‌గా పనిచేసిన అనుభవం ఉంది. 1991లో రెవెన్యూ సర్వీసులో చేరిన ఆయన సూరత్‌లో ఆదాయ పన్ను శాఖలో ఇన్వెస్టిగేషన్ డైరెక్టర్‌గా కూడా పనిచేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa