కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని జగద్గిరిగుట్ట డివిజన్ పరిధిలో, మాజీ కార్పొరేటర్ కొలుకుల జగన్ గురువారం మగ్దూం నగర్ నుంచి బీరప్ప నగర్ వరకు పాదయాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా సీసీ రోడ్ల పనులను పరిశీలించిన ఆయనకు స్థానికులు పలు సమస్యలను వివరించారు. సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తానని హామీ ఇచ్చిన జగన్, సీసీ రోడ్డు పనులను త్వరలోనే పూర్తి చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎలక్ట్రికల్ ఏఈ రాధాకృష్ణరెడ్డి, వేణు యాదవ్, మోహన్ రెడ్డి, నరేష్ రాజు, సంపత్ రెడ్డి, సునీల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa