రాజన్న సిరిసిల్ల జిల్లా, వీర్నపల్లి మండల కేంద్రంలో హిందూ సమ్మేళనం కరపత్రాన్ని హిందు సమ్మేళన నిర్వహణ కమిటీ అధ్యక్షుడు దేవయ్య, సర్పంచ్ మల్లారపు జ్యోత్స్న, ఉప సర్పంచ్ నరేష్, ఏఎంసీ వైస్ చైర్మన్ లక్ష్మన్, కమిటీ సభ్యులు కలిసి శుక్రవారం ఆవిష్కరించారు. ఈ నెల 23న సాయంత్రం 5 గంటలకు కళ్యాణ సీతారామాంజనేయ ఆలయంలో జరగనున్న హిందూ సమ్మేళనాన్ని విజయవంతం చేయాలని వారు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ దేవరాజు, వార్డు సభ్యులు, కమిటీ సభ్యులు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa