ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం మున్సిపల్ సిబ్బంది నిరసన

Telangana Telugu |  Suryaa Desk  | Published : Fri, Apr 17, 2026, 03:21 PM

కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా మున్సిపల్ ఎంప్లాయిస్ డిస్ట్రిక్ట్ ఫోరం ఆధ్వర్యంలో ఉద్యోగులు తమ సమస్యల పరిష్కారం కోసం శుక్రవారం కాగజ్నగర్ మున్సిపల్ కార్యాలయం ఎదుట భోజన విరామ సమయంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. జిల్లా అధ్యక్షుడు కుంటాల నారాయణ, కార్యదర్శి రఫీక్ అహ్మద్ నాయకత్వంలో జరిగిన ఈ కార్యక్రమంలో, ఉద్యోగులు పిఆర్సీ అమలు, పెండింగ్ డిఏల చెల్లింపు, హెల్త్ కార్డుల జారీ, పెండింగ్ బిల్లుల విడుదల, సీపీఎస్ రద్దు వంటి డిమాండ్లను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని కోరుతూ నినాదాలు చేశారు. ఉపాధ్యక్షులు యు. సుధాకర్, పి. సుజాత, సంయుక్త కార్యదర్శి ఫాతిమా బేగం తదితరులు పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa