తిరుమల శ్రీవారి దర్శనానికి భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. టోకెన్ రహిత సర్వదర్శనం కోసం ఒక కంపార్టుమెంటులో మాత్రమే భక్తులు వేచి ఉన్నారు. శ్రీవారి సర్వదర్శనానికి 4 గంటల సమయం పడుతోంది. మంగళవారం 68,601 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం 5.21 కోట్ల రూపాయలు వచ్చినట్టు టీటీడీ వెల్లడించింది. స్వామివారికి 23,396 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa