కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ నేతృత్వంలో రాజస్థాన్లోని జైసల్మేర్లో వస్తు సేవల పన్ను (జీఎస్టీ) కౌన్సిల్ 55వ సమావేశం శనివారం జరిగింది. ఈ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఏసీసీ బ్లాక్స్, ఫోర్టిఫైడ్ రైస్, ఫ్లేవర్డ్ పాప్కార్న్ వంటి వాటికి సంబంధించిన ట్యాక్స్ రేట్లపై క్లారిటీ ఇచ్చింది. అలాగే పాత, సెకండ్ హ్యాండ్ కార్లపై జీఎస్టీ రేట్లు పెంచూ నిర్ణయం తీసుకుంది. దీంతో పాత కార్లు కొనుగోలు చేసే వారిపై అదనపు భారం పడనుంది. అయితే, ఇది అన్ని సందర్భాల్లో వర్తించదు. కేవలం సెకండ్ హ్యాండ్ కార్ల విక్రయ వ్యాపారం నిర్వహిస్తున్న వారి వద్ద కొనుగోలు చేసినప్పుడే జీఎస్టీ పడుతుంది. వ్యక్తిగతంగా విక్రయాలు జరిపినప్పుడు ట్యాక్స్ వర్తించదని స్పష్టం చేసింది.
ఆటోక్లేవ్డ్ అయిరేటెడ్ కాంక్రీట్ బ్లాక్స్ 50 శాతానికిపైగా ఫ్లా యాష్ ఉపయోగిస్తే అవి హెచ్ ఎస్ కోడ్ 6815 పరిధిలోకి వస్తాయని స్పష్టం చేసింది జీఎస్టీ మండలి. వాటికి జీఎస్టీ 18 శాతం కాకుండా 12 శాతం వర్తిస్తుందని తెలిపింది. ఇక పాత, యూజ్డ్ కార్ల, ఈవీ కార్లతో సహా వ్యాపార సంస్థలు విక్రయించినప్పుడు ప్రస్తుతం ఉన్న జీఎస్టీ రేటు 12 శాతం నుంచి 18 శాతానికి పెంచుతూ నిర్ణయం తీసుకుంది. అయితే, వ్యక్తిగతంగా విక్రయించినప్పుడు జీఎస్టీ పెంపు వర్తించదని పేర్కొంది.
2018, జనవరి 25న విడుదల చేసిన సెంట్రల్ ట్యాక్స్ నోటిఫికేషన్ నవంబర్ 4 ప్రకారం పాత కార్లు ఈవీలతో పాటుగా (1200 సీసీ ఆపైన ఇంజిన్ కెపాసిటీ ఉండి, 4000 ఎంఎంపైన పొడవు ఉన్న పెట్రోల్ వాహనాలు కాకుండా, 1500 సీసీ, 400 ఎంఎం ఎస్యూవీ వాహనాలు కాకుండా) వాటికి 12 శాతం జీఎస్టీ వసూలు చేస్తోంది. ఇక పెట్రోల్, డీజీల్ వాహనాలకు 18 శాతం జీఎస్టీ వసూలు చేయనున్నారు. ఇప్పటికే పాత వాహనాల విక్రయాలపై మార్జిన వసూలు చేస్తే 18 శాతం జీఎస్టీ అనేది ఉంది. ఇప్పుడు ఎలక్ట్రిక్ వెహికల్,్ ఇతర వాహనాలకు సైతం 18 శాతం జీఎస్టీ వర్తించనుంది.
మరోవైపు.. ఫోర్టిఫైడ్ రైస్ (బలవర్థక బియ్యం) కోసం జీఎస్టీ నిర్మాణాన్ని సరళీకృతం చేయాలని కౌన్సిల్ సిఫార్సు చేసింది. ఇప్పటికే ఉన్న రాయితీలను క్లిష్టతరం చేయకుండా తుది వినియోగంతో సంబంధం లేకుండా పన్ను రేటును 5 శాతానికి తగ్గించాలని నిర్ణయించింది. అలాగే పాప్కార్న్ పైనా ట్యాక్స్ విధిస్తున్నట్లు తెలిపింది. అయితే అది ఫ్లేవర్ బట్టి ట్యాక్స్ రేటు ఉంటుందని పేర్కొంది. సాల్ట్ లేదా మసాలా పాప్ కార్న్ ప్యాక్ చేయకుండా అమ్మితే దానిపి 5 శాతం జీఎస్టీ పడనుంది. ఇక ప్యాక్ చేసి అమ్మితే 12 శాతం, షుగర్ కలిపిన పాప్ కార్న్ అయితే 18 శాతం జీఎస్టీ వసూలు చేయనున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa