ఏపీలో అంతు చిక్కని వైరస్ కలకలం రేపుతోంది. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో రోజుకు వేల సంఖ్యలో కోళ్లు మృత్యువాత పడుతున్నాయి. గతేడాది డిసెంబర్లో మొదలైన ఈ వైరస్.. జనవరి 13 తర్వాత విజృంభించింది. H15N వైరస్ లక్షణాలతో ఇప్పటికే 40 లక్షల కోళ్ల చనిపోయి ఉంటాయని అంచనా అధికారులు వేస్తున్నారు. అంతు చిక్కని వైరస్తో కోళ్లు చనిపోతున్నాయని, తాము తీవ్రంగా నష్టపోతున్నామని రైతులు వాపోతున్నారు.