ఇంగ్లాండ్తో జరిగిన ఐదు మ్యాచ్ల వన్డే సిరీస్ను భారత్ 4-1తో కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. ఆదివారం ముంబై వేదికగా జరిగిన ఐదో టీ20 మ్యాచ్లో టీమిండియా 150 రన్స్ తేడాతో పర్యాటక ఇంగ్లాండ్ను చిత్తు చేసింది. ఫలితంగా ఇంగ్లాండ్ చరిత్రలోనే టీ20ల్లో అత్యంత చెత్త ఓటమిని ఆ జట్టుకు అప్పగించింది. ఇక టీ20ల సమరం ముగియడంతో.. మరో మూడు రోజుల్లో వన్డే సిరీస్కు తెరలేవనుంది. ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు భారత్ ఆడే చివరి సిరీస్ ఇదే. దీంతో ఈ సిరీస్ను సన్నాహకంగా ఉపయోగించుకోవాలని భారత్ భావిస్తోంది.
టీ20 జట్టుతో పోలిస్తే.. వన్డేలకు భారత జట్టు భిన్నంగా ఉంది. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, జస్ప్రీత్ బుమ్రా, శ్రేయస్ అయ్యర్, రిషభ్ పంత్ లాంటి ప్లేయర్లు ఈ జట్టులో ఉన్నారు. ఇక ఈ సిరీస్లో మొత్తం 3 వన్డేలు జరగనున్నాయి. అందులో తొలి వన్డే ఈనెల 6 నుంచి నాగ్పూర్ వేదికగా జరగనుంది. ఇందుకోసం భారత ప్లేయర్లు నాగ్పూర్లో అడుగుపెట్టారు.
స్టార్ ప్లేయర్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మతో పాటు శ్రేయస్ అయ్యర్, రిషభ్ పంత్, యశస్వి జైశ్వాల్, శుభ్మన్ గిల్ వంటి ప్లేయర్లు ఆదివారం రాత్రే.. నాగ్పూర్కు చేరుకున్నారు. టీ20 జట్టులో ఉన్న ఆటగాళ్లు.. సోమవారం టీమిండియాతో కలిసే అవకాశం ఉంది. భారత క్రికెటర్లు నాగ్పూర్ ఎయిర్పోర్ట్లో దిగిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. తమ అభిమాన క్రికెటర్లను చూసేందుకు ఫ్యాన్స్ తరలివచ్చారు.
భారత్-ఇంగ్లాండ్ వన్డే సిరీస్ షెడ్యూల్..
తొలి వన్డే: ఫిబ్రవరి 06 (నాగ్పూర్)
రెండో వన్డే: ఫిబ్రవరి 09 (కటక్)
మూడో వన్డే: ఫిబ్రవరి 12 (అహ్మదాబాద్)
మ్యాచ్లన్నీ మధ్యాహ్నం 1.30 గంటలకు ప్రారంభం అవుతాయి.
ఇంగ్లాండ్తో వన్డే సిరీస్కు భారత జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్మన్ గిల్ (వైస్ కెప్టెన్), విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహు్ (వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, హర్షిత్ రాణా, మహమ్మద్ షమీ, అర్షదీప్ సింగ్, యశస్వి జైశ్వాల్, రిషభ్ పంత్, రవీంద్ర జడేజా