అంతర్జాతీయ మార్కెట్ల మిశ్రమ సంకేతాలతో పాటు.. ఆర్బీఐ సమీక్ష నిర్ణయాల నేపథ్యంలో దేశీయ మార్కెట్లు శుక్రవారం నష్టాలతో ప్రారంభయ్యాయి. పరపతి విధాన సమీక్ష నిర్ణయాలను ఆర్బీఐ (RBI) నేడు వెల్లడించనున్న నేపథ్యంలో మదుపర్లు అప్రమత్తత పాటిస్తున్నారు. దీంతో సూచీలు (Stock Market) ఒత్తిడికి లోనవుతున్నాయి. ఉదయం 9.30 గంటల సమయంలో సెన్సెక్స్ (Sensex) 57.44 పాయింట్లు నష్టపోయి 78,000.72 వద్ద, నిఫ్టీ (Nifty) 24.45 పాయింట్లు నష్టపోయి 23,578.90 వద్ద ట్రేడ్ అవుతున్నాయి.డాలర్తో రూపాయి మారకం విలువ 87.57 గా కొనసాగుతోంది. నిఫ్టీలో భారతీ ఎయిర్టెల్, బ్రిటానియా, హీరో మోటార్స్, శ్రీరామ్ ఫైనాన్స్, అపోలో హాస్పిటల్స్ షేర్లు రాణిస్తున్నాయి. ఓఎన్జీసీ, ఎస్బీఐ, హిందుస్థాన్ యునీలివర్, రిలయన్స్ ఇండస్ట్రీస్, హెచ్సీఎల్ టెక్నాలజీస్ షేర్లు ఒత్తిడికి గురవుతున్నాయి.ఆసియా పసిఫిక్ మార్కెట్లు శుక్రవారం మిశ్రమంగా కదలాడుతున్నాయి. ఆస్ట్రేలియా ఏఎస్ఎక్స్ సూచీ ఫ్లాట్గా ఉండగా.. జపాన్ నిక్కీ 0.44శాతం, దక్షిణ కొరియా కోస్పీ సూచీ 0.17శాతం నష్టాలతో ట్రేడ్ అవుతున్నాయి. హాంకాంగ్ హాంగ్సెంగ్ సూచీ 0.6శాతం లాభంతో కొనసాగుతోంది. గురువారం అమెరికా మార్కెట్లు రాణించాయి. ఎస్అండ్పీ సూచీ 0.36 శాతం, నాస్డాక్ 0.51 శాతం, డోజోన్స్ 0.28 శాతం మేర లాభపడ్డాయి.
![]() |
![]() |