ఫిబ్రవరి 14న వాలెంటైన్స్ డే అన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ప్రియమైన వారికి గిఫ్ట్స్ ఇస్తుంటారు. ముఖ్యంగా ప్రేమికులు, నూతన జంటలు ఇలా తమ ప్రేమను వ్యక్తపరిచేందుకు బహుమతి రూపంలో ఏదైనా ఇస్తుంటారు. ఇందులో ఎక్కువగా గోల్డ్ రింగ్స్, గోల్డ్ చెయిన్స్, నెక్లెస్ ఇలాంటివి కూడా ఉంటాయి. ముఖ్యంగా భారత్లో మహిళలకు బంగారం అంటే ఎంతో ఇష్టం ఉంటుంది. బంగారు ఆభరణాలు ధరిస్తే వారి అందం మరింత పెరుగుతుందని చెప్పొచ్చు. అందుకే.. గోల్డ్ జువెల్లరీని ఎక్కువగా భర్తలు.. తమ భాగస్వాములకు గిఫ్ట్గా ఇస్తుంటారు. ఈ క్రమంలోనే వాలెంటైన్స్ డే దగ్గరపడుతున్న వేళ.. దేశంలోని ప్రముఖ జువెల్లరీలలో గోల్డ్ రేట్లు ఎలా ఉన్నాయనేది తెలుసుకుందాం.
అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ కఠిన నిర్ణయాలు తీసుకుంటున్న వేళ.. అంతర్జాతీయంగా అనిశ్చిత పరిస్థితులు నెలకొన్నాయని చెప్పొచ్చు. దీంతో సంక్షోభ పరిస్థితుల్లో సేఫ్ హెవెన్గా (సురక్షిత పెట్టుబడి) బంగారాన్ని భావిస్తుంటారు. దీంతో పెట్టుబడులు పెరిగి.. గోల్డ్ రేట్లు పెరుగుతూ పోతున్నాయి. ఇప్పుడు ఆల్ టైమ్ గరిష్ట స్థాయిల్లోనే ఉన్నాయి. ఈ ఏడాదిలోనే ఇప్పటివరకు గోల్డ్ ధరలు 10 శాతానికిపైగా పెరిగాయి.
ఇంకా బంగారం ధరలు ప్రాంతాల్ని బట్టి మారుతుంటాయి. స్థానిక పన్ను రేట్లు సహా ఇతర అంశాలు ఇందుకు దోహదం చేస్తాయి. ప్రాంతాల్ని బట్టే కాకుండా ఇంకా షాపుల్ని బట్టి కూడా తేడాలు గమనించొచ్చు. ప్రస్తుతం దేశంలోని టాప్ జువెల్లరీల్లో గ్రాము గోల్డ్ రేటు ఎంత ఉందనేది చూద్దాం.
కల్యాణ్ జువెల్లర్స్లో 22 క్యారెట్ల గోల్డ్ రేటు ఫిబ్రవరి 8న గ్రాముకు రూ. 7945 పలుకుతోంది. ఇక తనిష్క్ జువెల్లరీలో గ్రాము గోల్డ్ ధర రూ. 7990 గా ఉంది. మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్లో గోల్డ్ రేటు గ్రాము రూ. 7945 వద్ద కొనసాగుతోంది. జోయాలుక్కాస్లో కూడా ఇదే రేట్లు ఉన్నాయి. అయితే ఇది వాస్తవ ధర కాదని గ్రహించాలి. గోల్డ్ జువెల్లరీ తీసుకుంటే.. అక్కడ మేకింగ్ ఛార్జీలు పడతాయి. ఇది గోల్డ్ ప్రైస్పై వర్తిస్తుంది. ఇది కూడా జువెల్లరీల్ని బట్టి మారుతుంది. సాధారణంగా 5 నుంచి 25 శాతం వరకు ఉంటాయి. తరుగు ఛార్జీలు కూడా వసూలు చేస్తాయి. ఇక జీఎస్టీ 3 శాతంగా ఉంటుంది. హాల్ మార్క్ ఛార్జీలు అదనంగా ఉంటాయి. అందుకే గోల్డ్ జువెల్లరీ కొనుగోలు చేసేటప్పుడు వీటన్నింటినీ పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుంది. అంతర్జాతీయ మార్కెట్లో కూడా బంగారం ధరలు ఇటీవల భారీగా పెరుగుతున్నాయి.
![]() |
![]() |