ఒకే రోజు స్కూల్, కాంప్లెక్స్ సమావేశాలు నిర్వహించడం సరికాదని పలు ఉపాధ్యాయ సంఘాల నేతలు విమర్శించారు. ఈ మేరకు బుధవారం ఏపీటీఎఫ్, ఎస్టీయూ నాయకులు వేర్వేరుగా విద్యాశాఖ అధికారుల తీరును ఖండించారు. విద్యాశాఖ విడుదల చేసిన పాఠశాల కాంప్లెక్స్ సమావేశాల సమయాలను మార్చాలని ఏపీటీఎఫ్ నాయకులు కోరారు. ఆ సంఘం నాయకులు డీఈఓ ప్రసాద్బాబుకు వినతి పత్రం అందజేశారు. అనంతపురం జిల్లా అధ్యక్షుడు వెంకటేష్, ప్రధానకార్యదర్శి సిరాజుద్దీన మాట్లాడుతూ.. స్కూళ్లలో తరగతులు బోధించి, విద్యార్థులకు మధ్యాహ్న భోజనం అందించి 20 కిలోమీటర్ల నుంచి 25 కిలోమీటర్ల దూరంలోని కాంప్లెక్స్ మీటింగ్స్కు హాజరుకావడం అసాధ్యమని అన్నారు. కార్యక్రమంలో ఆ సంఘం నాయకులు నరసింహులు, వెంకటమరరణ, సర్ధార్వలి, చిదంబరరెడ్డి, బాలరామ్మోహన, సూర్యనారాయణ, ఈశ్వరయ్య, తిప్పేస్వామి,మహేష్ పాల్గొన్నారు.
![]() |
![]() |