ట్రెండింగ్
Epaper    English    தமிழ்

క్రెడిట్ కార్డు రూల్స్.. ఎస్బీఐ కార్డ్స్ షాకింగ్ ప్రకటన

business |  Suryaa Desk  | Published : Tue, Mar 18, 2025, 10:53 PM

అత్యవసర సమయంలో ఆదుకుంటుందని క్రెడిట్ కార్డులు వాడే వారి సంఖ్య చాలా ఎక్కువగా ఉంటుంది. ఇటీవల క్రెడిట్ కార్డుల వినియోగం కూడా బాగానే పెరిగిపోయినట్లు ఎప్పటికప్పుడు గణాంకాలు స్పష్టం చేస్తూనే ఉన్నాయి. డెబిట్ కార్డులు ఎలా వాడుతున్నారో.. చాలా మంది దానికి మించి క్రెడిట్ కార్డుల్ని తీసుకుంటుంటారు. ఇక క్రెడిట్ కార్డులు చాలా రకాలుగా ఉంటాయి. కొన్నేమో షాపింగ్ చేసిన వారికి డిస్కౌంట్లు అందిస్తే.. ఇంకొన్ని క్యాష్ బ్యాక్స్, ఇంకొన్ని రివార్డ్స్ అందిస్తుంటాయి. ఇలా వేర్వేరు ప్రయోజనాలు ఉంటాయి. ఈ ప్రయోజనాల్ని ఆయా క్రెడిట్ కార్డు జారీ సంస్థలు.. అంటే బ్యాంకులు లేదా ఇతర ఆర్థిక సంస్థలు తరచుగా సవరిస్తుంటాయి. మీరు ఇప్పుడు ఎస్బీఐ కార్డ్స్.. క్రెడిట్ కార్డును వాడుతున్నట్లయితే మీకు అలర్ట్. ఈ ముఖ్యమైన విషయం గురించి తెలుసుకోవాలి.


ఎస్‌బీఐ కార్డ్స్ కొన్ని ఎంపిక చేసినటువంటి.. క్రెడిట్ కార్డులపై రివార్డు పాయింట్లను తగ్గించింది. మార్చి 31 నుంచి ఇవి అమల్లోకి రానున్నాయి. స్విగ్గీ, ఎయిరిండియా టికెట్లపై వచ్చే రివార్డులు.. ఇకపై తక్కువగా వస్తాయి. సింప్లీక్లిక్ ఎస్‌బీఐ కార్డు, ఎయిరిండియా ఎస్‌బీఐ ప్లాటినమ్ కార్డు, ఎయిరిండియా ఎస్‌బీఐ సిగ్నేచర్ కార్డు ఉన్నవారికి వచ్చే నెల నుంచి ఈ మార్పులు వర్తిస్తాయి. అంటే ఇక్కడ ప్రయోజనాల్ని కుదించిందని చెప్పొచ్చు.


 తన పాపులర్ క్రెడిట్ కార్డుల్లో ఒకటైన.. సింప్లీక్లిక్ ఎస్‌బీఐ కార్డుపై.. స్విగ్గీ కొనుగోళ్లపై చూస్తే ఇంతకు ముందు 10X రివార్డులు వచ్చేవి. కానీ ఏప్రిల్ 1 నుంచి ఇది 5X రివార్డు పాయింట్లకు మాత్రమే పరిమితం కానుంది. అయితే.. అపోలో 24×7, బుక్‌మైషో, క్లియర్‌ట్రిప్‌, మింత్రా, డామినోస్‌, యాత్ర, నెట్‌మెడ్స్‌ ప్లాట్‌ఫామ్‌ల ద్వారా ఆన్‌లైన్ కొనుగోలు చేస్తే మాత్రం 10X రివార్డులు యథావిధిగా వస్తాయి.


ఎయిరిండియా ఎస్‌బీఐ ప్లాటినమ్ క్రెడిట్ కార్డు వాడేవారు ఎయిరిండియా టికెట్ బుక్ చేసుకుంటే ప్రతి రూ.100కు 15 రివార్డు పాయింట్లు పొందేవాళ్ళు. ఇది ఎయిరిండియా యాప్ లేదా వెబ్‌సైట్‌లో బుక్ చేసుకుంటేనే వర్తిస్తుంది. కానీ మార్చి 31 నుంచి ఇది 5 రివార్డు పాయింట్లకు మాత్రమే పరిమితం అని ఎస్‌బీఐ కార్డ్స్ తన వెబ్‌సైట్‌లో తెలిపింది. అంటే.. 'మార్చి 31 నుంచి 5 రివార్డు పాయింట్లు మాత్రమే అందుతాయి'' అని ఎస్‌బీఐ కార్డ్స్ స్పష్టం చేసింది.


అలాగే, ఎయిరిండియా ఎస్‌బీఐ సిగ్నేచర్ క్రెడిట్ కార్డు ఉన్నవారు ఎయిరిండియా టికెట్ బుకింగ్‌పై ప్రతి రూ.100కు 30 రివార్డు పాయింట్లు పొందుతున్నారు. మార్చి 31 నుంచి దీనిని రూ.100కు 10 రివార్డు పాయింట్లకు తగ్గిస్తున్నట్లు ఎస్‌బీఐ కార్డ్స్ వెబ్‌సైట్‌లో పేర్కొంది. ఈ రివార్డులు ఎయిరిండియా వెబ్‌సైట్, మొబైల్ యాప్ ద్వారా చేసే లావాదేవీలకు మాత్రమే వర్తిస్తాయి. కాబట్టి, ఎస్‌బీఐ క్రెడిట్ కార్డు వాడుతున్నవారు ఈ మార్పులను గమనించాలి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com