హార్దిక్ పాండ్యా చిన్న పిల్లలతో చాలా జోవియల్గా ఉంటాడు. ఐపీఎల్ 2025లో తమ తొలి మ్యాచ్ కోసం ముంబై ఇండియన్స్ జట్టు చెన్నైకి చేరుకుంది. చెపాక్ స్టేడియంలోనే ముంబై కూడా ప్రాక్టీస్ చేస్తోంది. మ్యాచ్కి రెండు రోజుల ముందు నుంచే ముంబై ప్లేయర్లు గ్రౌండ్లో ప్రాక్టీస్ మొదలుపెట్టారు. అయితే తొలి రోజు ప్రాక్టీస్ సెషన్ అనంతరం హార్దిక్ చిన్నారులకు ఆటోగ్రాఫ్ ఇస్తూ వాళ్లతో సరదాగా మాట్లాడాడు.
ఆటోగ్రాఫ్ తీసుకోవడానికి వచ్చిన వాళ్లల్లో ఒక పాప చాలా క్యూట్గా హార్దిక్ను ఒక ప్రశ్న వేసింది. 'నాకొక ప్రశ్న ఉంది. హా.. అడుగు. ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచిన తర్వాత ఎలా ఫీలయ్యావు. నేను చాలా ఎంజాయ్ చేశాను. మరి నువ్వు ఎంజాయ్ చేశావా? నేను మ్యాచ్ మొత్తం చూశాను. నిజంగానా, వెరీ గుడ్' అంటూ హార్దిక్, పాప మధ్య క్యూట్గా సంభాషణ జరిగింది.
ప్రాక్టీస్లో భారీ షాట్స్ కొట్టిన హార్దిక్.. చాలా ఎక్కువ సేపు నెట్స్లో ఉన్నాడు. ఒళ్లంతా చెమటతో తడిచినప్పటికీ తన కోసం చిన్నారులు వేచి ఉండటంతో నేరుగా వారి దగ్గరికి వచ్చి ఆటోగ్రాఫ్స్ ఇచ్చాడు. హార్దిక్ హార్దిక్ అంటూ పిల్లలు హోరెత్తించారు. అక్కడ ఉన్న వారు సెల్ఫీలు కూడా తీసుకున్నారు.
ఐపీఎల్ 2024 నుంచి ముంబై ఇండియన్స్ కెప్టెన్గా హార్దిక్ పాండ్యా కొనసాగుతున్నాడు. అంతకు ముందు వరకూ ఉన్న రోహిత్ను ముంబై మేనేజ్మెంట్ తప్పించి కెప్టెన్సీ పగ్గాలను హార్దిక్కు అప్పజెప్పింది. ఐపీఎల్ 2024 కేవలం నాలుగు మ్యాచ్లలోనే గెలిచిన ముంబై ఇండియన్స్ పాయింట్ల పట్టికలో అట్టడుగు స్థానానికి వెళ్లింది.
ఐపీఎల్ 2025లో మంచి మంచి ప్లేయర్లను కొనుగోలు చేసిన ముంబై ఫ్రాంచైజీ ఈ ఏడాది కప్ కొట్టాలని చూస్తోంది. గత సీజన్ చివరి మ్యాచ్లో స్లో ఓవర్ల కారణంగా హార్దిక్ తొలి మ్యాచ్కు దూరమయ్యాడు. దాంతో చెన్నై సూపర్ కింగ్స్తో జరిగే తొలి మ్యాచ్కి సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్గా వ్యవహరించనున్నాడు. మార్చి 23 రాత్రి 7 గంటలకు చెన్నై-ముంబై మ్యాచ్ జరగనుంది.
![]() |
![]() |