ఇండియన్ ప్రీమియర్ లీగ్ (I సీజన్ ఇవాళ్టి నుంచి ప్రారంభం కానుంది. తొలి మ్యాచులో కోల్కతా నైట్ రైడర్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు తలపడనున్నాయి. ఇప్పటికే దాదాపు అన్ని జట్లూ కూడా తమ తొలి మ్యాచ్ వేదికకు చేరుకున్నాయి. అక్కడే ప్రాక్టీస్ కూడా ప్రారంభించాయి. అయితే ఢిల్లీ క్యాపిటల్స్ ప్లేయర్ కేఎల్ రాహుల్ మాత్రం.. ఇప్పటికీ జట్టుతో చేరలేదు. ఇటీవల భారత బ్యాటింగ్ కోచ్ అభిషేక్ నాయర్తో కలిసి ముంబైలో బ్యాటింగ్ ప్రాక్టీస్ చేశాడు.
ఇక ఐపీఎల్ 2025లో ఢిల్లీ క్యాపిటల్స్ తరఫున రాహుల్ బరిలోకి దిగనున్నాడు. ఆ జట్టు తన తొలి మ్యాచులో లక్నో సూపర్ జెయింట్స్తో తలపడనుంది. మార్చి 24న విశాఖపట్నం వేదికా ఈ మ్యాచ్ జరగనుంది. ఢిల్లీ తన రెండో మ్యాచ్ కూడా విశాఖపట్నంలోనే ఆడనుంది. ఇందుకోసం ఇప్పటికే జట్టు మొత్తం నగరానికి చేరుకుంది. అయితే ఈ జట్టులో కేఎల్ రాహుల్ లేడు. అతడు ఇంకా ఢిల్లీ క్యాపిటల్స్ జట్టులో చేరలేడు.
కేఎల్ రాహుల్ ఢిల్లీ క్యాపిటల్స్ తొలి రెండు మ్యాచులకు దూరం కానున్నట్లు తెలుస్తోంది. అతడి సతీమణి అతియా శెట్టి మొదటి బిడ్డకు జన్మనివ్వనుంది. ఈ విషయాన్ని ఆస్ట్రేలియా మహిళా క్రికెటర్ అలిసా హీలీ చెప్పింది. ఐపీఎల్ 2025లో అలిసా హీలీ భర్త మిచెల్ స్టార్క్ కూడా ఢిల్లీ క్యాపిటల్స్ తరఫున ఆడనునండటం గమనార్హం. ఈ కారణంతోనే కేఎల్ రాహుల్ డీసీ.. తొలి రెండు మ్యాచులకు దూరం కానున్నట్లు ఖరారైంది.
2025 ఐపీఎల్ కోసం ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు:అక్షర్ పటేల్ (కెప్టెన్), కేఎల్ రాహుల్, కుల్దీప్ యాదవ్, ట్రిస్టాన్ స్టబ్స్, అభిషేక్ పోరెల్, మిచెల్ స్టార్క్, జేక్ ఫ్రాసెర్ మెక్గుర్క్, నటరాజన్, ముకేశ్ కుమార్, కరుణ్ నాయర్, సమీర్ రిజ్వీ, అశుతోష్ శర్మ, మోహిత్ శర్మ, డుప్లెసిస్, దర్శన్ నాల్కండే, విప్రాజ్ నిగమ్, దుష్మంత చమీర, డొనోవన్ ఫెరీరా, మన్వంత్ కుమార్, అజయ్ మండల్, మాధవ్ తివారి, త్రిపురన విజయ్
![]() |
![]() |