ట్రెండింగ్
Epaper    English    தமிழ்

విశాఖ వేదికగా వన్డే మ్యాచ్.. 2025లో స్వదేశంలో భారత షెడ్యూల్‌ ఇదే

sports |  Suryaa Desk  | Published : Wed, Apr 02, 2025, 11:14 PM

ఓ పక్క ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 జరుగుతుండగానే.. భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారత క్రికెట్ జట్టు షెడ్యూల్‌ను ప్రకటించింది. ఈ మేరకు ఈ ఏడాది భారత జట్టు స్వదేశంలో ఆడబోయే సిరీస్‌ల వివరాలను బుధవారం వెల్లడించింది. దీనిపై అధికారికంగా ప్రకటన విడుదల చేసింది. బీసీసీఐ ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం, ఈ ఏడాది అక్టోబర్‌లో వెస్టిండీస్‌.. నవంబర్‌, డిసెంబర్‌ నెలల్లో దక్షిణాప్రికా క్రికెట్‌ జట్లు భారత్‌లో పర్యటించనున్నాయి.


తొలుత వెస్టిండీస్‌ క్రికెట్‌ జట్టు 2 మ్యాచ్‌ల టెస్ట్‌ సిరీస్‌ కోసం భారత్‌కు రానుంది. సుమారు ఏడేళ్ల తర్వాత వెస్టిండీస్ జట్టు టెస్టు సిరీస్‌లో ఆడేందుకు భారత్‌కు రానుంది. ఇందులో తొలి టెస్టు అహ్మదాబాద్‌ వేదికగా అక్టోబర్‌ 2-6 మధ్య జరగనుంది. ఆ తర్వాత కోల్‌కతా వేదికగా అక్టోబర్‌ 10-14 మధ్య రెండో టెస్టు జరగనుంది.


ఇక నవంబర్‌ నెలలో దక్షిణాఫ్రికా జట్టు టెస్టు, వన్డేలు, టీ20 సిరీస్ ఆడేందుకు భారత్‌లో అడుగుపెట్టనుంది. ఈ పర్యటనలో ప్రొటీస్ జట్టు రెండు టెస్ట్‌లు.. మూడు వన్డేలు, ఐదు టీ20లు ఆడనుంది. నవంబర్‌ 14న న్యూఢిల్లీ వేదికగా తొలి టెస్టు.. నవంబర్‌ 22న గువహతి వేదికగా రెండో టెస్టు ప్రారంభం కానుంది. ఆ తర్వాత వన్డే, టీ20 సిరీస్‌ జరగనుంది. దక్షిణాఫ్రికాతో జరిగే 3వ వన్డేకు విశాఖపట్నం వేదికగా ఉంది.


కాగా ఐపీఎల్ 2025 తర్వాత భారత క్రికెట్ జట్టు ఇంగ్లాండ్‌లో పర్యటించనుంది. అక్కడ ఐదు టెస్టు మ్యాచ్‌లు ఆడనుంది. ఆ తర్వాత స్వదేశంలో సిరీస్ ప్రారంభం కానుంది.


స్వదేశంలో భారత సిరీస్‌ల వివరాలు..


భారత్‌-వెస్టిండీస్‌..


తొలి టెస్టు - అక్టోబర్ 2 - 6 (అహ్మదాబాద్‌)


2వ టెస్టు - అక్టోబర్ 10 - 14 (కోల్‌కతా)


దక్షిణాఫ్రికాతో ద్వైపాక్షిక సిరీస్‌ షెడ్యూల్‌..


తొలి టెస్టు - నవంబర్ 14-18 (ఢిల్లీ)


రెండో టెస్టు - నవంబర్ 22-26 (గువహతి)


తొలి వన్డే - నవంబర్ 30 (రాంచీ)


2వ వన్డే - డిసెంబర్ 3 (రాయ్‌పూర్)


3వ వన్డే - డిసెంబర్ 6 (విశాఖ)


తొలి టీ20 - డిసెంబరు 9 (కటక్‌)


2వ టీ20 - డిసెంబరు 11 (ఛండీగఢ్‌)


3వ టీ20 - డిసెంబరు 14 (ధర్మశాల)


4వ టీ20 - డిసెంబరు 17 (లక్నో)


5వ టీ20 - డిసెంబరు 19 (అహ్మదాబాద్)






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com