దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు నష్టాల్లో ముగిశాయి. ప్రతీకార సుంకాల నుంచి ఫార్మా ఉత్పత్తులను ట్రంప్ మినహాయించడంతో ఆ సూచీ స్టాక్స్ రాణించాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 322 పాయింట్లు కోల్పోయి 76,295కి పడిపోయింది. నిఫ్టీ 82 పాయింట్లు పతనమై 23,250 వద్ద స్థిరపడింది.
పవర్ గ్రిడ్ కార్పొరేషన్ (4.34%), సన్ ఫార్మా (3.26%), అల్ట్రాటెక్ సిమెంట్ (2.92%), ఎన్టీపీసీ (1.97%), ఏషియన్ పెయింట్ (1.82%).
టాప్ లూజర్స్
టీసీఎస్ (-3.98%), టెక్ మహీంద్రా (-3.79%), హెచ్సీఎల్ టెక్నాలజీస్ (-3.71%), ఇన్ఫోసిస్ (-3.41%), టాటా మోటార్స్ (-2.64%).
![]() |
![]() |