ట్రెండింగ్
Epaper    English    தமிழ்

భారత్‌ లో విస్తరింస్తున్ మోటాన్...

business |  Suryaa Desk  | Published : Fri, Apr 04, 2025, 10:25 PM

ప్లాస్టిక్ ప్రాసెసింగ్ పరిశ్రమ కోసం వినూత్న పరిష్కారాలను అందించటంలో  ప్రపంచ ప్రసిద్ధి చెందిన మోటాన్ గ్రూప్, భారతదేశంలోని చెన్నైలో తమ అత్యాధునిక సౌకర్యం ప్రారంభిస్తున్నట్లు వెల్లడించింది.  నూతనంగా ప్రారంభించిన ఈ సౌకర్యం 2 మిలియన్ యూరోలు  (సుమారు రూ.17 కోట్లు) పెట్టుబడిని సూచిస్తుంది, ఇది భారత మార్కెట్ సామర్థ్యంపై మోటాన్ యొక్క విశ్వాసాన్ని ప్రతిబింబిస్తుంది. మూడు ఎకరాలకు పైగా విస్తరించి ఉన్న 20,000 చదరపు అడుగుల నిర్మాణం పరిశోధన, అభివృద్ధి , పంపిణీకి కేంద్రంగా పనిచేయనుంది. ఈ కార్యక్రమం,  భారతీయ కస్టమర్ల అవసరాలకు అనుగుణంగా అధిక-నాణ్యత కలిగిన ఉత్పత్తులు , సేవలను అందించే మోటాన్ సామర్థ్యాన్ని పెంపొందించడం లక్ష్యంగా పెట్టుకుంది. మోటాన్ గ్రూప్ యొక్క చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ శ్రీమతి ఫుల్సాక్ సాండ్రా, కంపెనీ యొక్క ప్రపంచ లక్ష్యం నొక్కి చెబుతూ : "1947లో కాన్స్టాన్స్ సరస్సు ఒడ్డున స్థాపించబడిన మోటాన్, ప్లాస్టిక్ పరిశ్రమలో ప్రాసెస్ పెరిఫెరల్స్ కోసం ప్రముఖ భాగస్వామిగా అభివృద్ధి చెందింది, ప్రపంచవ్యాప్తంగా 80కి పైగా దేశాలలో కార్యకలాపాలను నిర్వహిస్తుంది " అని అన్నారు. 


మోటాన్ గ్రూప్ యొక్క చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్  కార్ల్ లిథర్లాండ్, భారత మార్కెట్ యొక్క ప్రాముఖ్యతను వెల్లడిస్తూ  "భారతదేశం మాకు అతి పెద్ద మార్కెట్‌గా నిలువనుంది మరియు మేము చాలా కాలంగా భారతీయ భాగస్వాములతో కలిసి పనిచేస్తున్నాము. ఈ సౌకర్యం ప్రారంభం ఇక్కడ మా కార్యకలాపాలను విస్తరించటంలో  కీలకమైన క్షణాన్ని సూచిస్తుంది" అని అన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com