ప్లాస్టిక్ ప్రాసెసింగ్ పరిశ్రమ కోసం వినూత్న పరిష్కారాలను అందించటంలో ప్రపంచ ప్రసిద్ధి చెందిన మోటాన్ గ్రూప్, భారతదేశంలోని చెన్నైలో తమ అత్యాధునిక సౌకర్యం ప్రారంభిస్తున్నట్లు వెల్లడించింది. నూతనంగా ప్రారంభించిన ఈ సౌకర్యం 2 మిలియన్ యూరోలు (సుమారు రూ.17 కోట్లు) పెట్టుబడిని సూచిస్తుంది, ఇది భారత మార్కెట్ సామర్థ్యంపై మోటాన్ యొక్క విశ్వాసాన్ని ప్రతిబింబిస్తుంది. మూడు ఎకరాలకు పైగా విస్తరించి ఉన్న 20,000 చదరపు అడుగుల నిర్మాణం పరిశోధన, అభివృద్ధి , పంపిణీకి కేంద్రంగా పనిచేయనుంది. ఈ కార్యక్రమం, భారతీయ కస్టమర్ల అవసరాలకు అనుగుణంగా అధిక-నాణ్యత కలిగిన ఉత్పత్తులు , సేవలను అందించే మోటాన్ సామర్థ్యాన్ని పెంపొందించడం లక్ష్యంగా పెట్టుకుంది. మోటాన్ గ్రూప్ యొక్క చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ శ్రీమతి ఫుల్సాక్ సాండ్రా, కంపెనీ యొక్క ప్రపంచ లక్ష్యం నొక్కి చెబుతూ : "1947లో కాన్స్టాన్స్ సరస్సు ఒడ్డున స్థాపించబడిన మోటాన్, ప్లాస్టిక్ పరిశ్రమలో ప్రాసెస్ పెరిఫెరల్స్ కోసం ప్రముఖ భాగస్వామిగా అభివృద్ధి చెందింది, ప్రపంచవ్యాప్తంగా 80కి పైగా దేశాలలో కార్యకలాపాలను నిర్వహిస్తుంది " అని అన్నారు.
మోటాన్ గ్రూప్ యొక్క చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్ కార్ల్ లిథర్లాండ్, భారత మార్కెట్ యొక్క ప్రాముఖ్యతను వెల్లడిస్తూ "భారతదేశం మాకు అతి పెద్ద మార్కెట్గా నిలువనుంది మరియు మేము చాలా కాలంగా భారతీయ భాగస్వాములతో కలిసి పనిచేస్తున్నాము. ఈ సౌకర్యం ప్రారంభం ఇక్కడ మా కార్యకలాపాలను విస్తరించటంలో కీలకమైన క్షణాన్ని సూచిస్తుంది" అని అన్నారు.
![]() |
![]() |