డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్ననని బీజేపీ మహిళా నాయకురాలు పురందేశ్వరి అన్నారు. 'పవన్ కుమారుడు మార్క్ శంకర్ గాయపడ్డారని తెలిసి బాధపడ్డాను, మార్క్ శంకర్ త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నా' అని పేర్కొన్నారు. ఇదిలా ఉండగా, సింగపూర్లోని ఒక పాఠశాలలో చదువుతున్న పవన్ కొడుకు అగ్ని ప్రమాదంలో చేతులు, కాళ్లకు గాయాలైన విషయం తెలిసిందే. నిన్న పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలోని పార్టీ కార్యాలయంలో ఆమె బీజేపీ జెండాను ఆవిష్కరించారు. ముందు దేశం, తర్వాత పార్టీ, ఆ తర్వాత మనం అనేది పార్టీ సిద్ధాంతమని, దీన్ని కేడర్ పాటించాలని కోరారు. విజయవాడలోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలోనూ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు.
![]() |
![]() |