ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అమోనియా గ్యాస్ లీక్ కలకలం, భయాందోళనలో కార్మికులు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Apr 12, 2025, 07:18 PM

నెల్లూరు జిల్లాలో అమోనియా గ్యాస్ లీక్ కలకలం సృష్టించింది. టీపీగూడురు మండలం అనంతపురం గ్రామంలోని వాటర్ బేస్ కంపెనీలో ఈ ఘటన చోటుచేసుకుంది. శనివారం మధ్యాహ్నం గ్యాస్ లీక్ కావడంతో కార్మికులు భయాందోళనలతో బయటకు పరుగులు తీశారు. ఈ ఘటనలో ఊపిరాడక పది మంది కార్మికులు అస్వస్థతకు గురయ్యారు. అంబులెన్స్ ల సాయంతో వారిని హుటాహుటిన నెల్లూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అనంతపురం గ్రామంతో పాటు చుట్టుపక్కల గ్రామాలకూ గ్యాస్ వ్యాపించిందని స్థానికులు తెలిపారు. దీంతో భయాందోళనకు గురైన ప్రజలు ముందు జాగ్రత్తగా మాస్కులు ధరించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com