నేడు రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ జయంతి. దేశ వ్యాప్తంగా అంబేద్కర్ జయంతి వేడుకలు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆయనకు నివాళులర్పిస్తూ ట్వీట్లు చేశారు."ఎప్పుడూ అప్రమత్తులై, విద్యావంతులై ఆత్మగౌరవంతో, ఆత్మ విశ్వాసంతో ఉన్నప్పుడే ఆ జాతి బాగుపడుతుంది" అని భారతరత్న డాక్టర్ భీంరావు రాంజీ అంబేద్కర్ అన్నారని, ఆ మహాశయుని వాక్కు స్ఫూర్తిగా బడుగు వర్గాల ఆత్మగౌరవాన్ని నిలపడానికి, వారిలో ఆత్మవిశ్వాసాన్ని నింపడానికి అంకితభావంతో మనందరం కృషి చేద్దామని ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు. అంబేద్కర్ కలలుగన్న సమసమాజాన్ని సాధించుకుందామన్నారు.భారత రాజ్యాంగ నిర్మాతగా, స్వతంత్ర భారత తొలి న్యాయశాఖ మంత్రిగా, స్వాతంత్రోద్యమ వీరుడిగా... ఆధునిక భారత సమాజ నిర్మాణానికి పునాదులు వేసిన అంబేద్కర్ జయంతి సందర్భంగా ఆ మహానుభావుని దేశసేవను స్మరించుకుందామని, దళితాభ్యుదయానికి అందరం పునరంకితమవుదామని చంద్రబాబు ట్వీట్ చేశారు.
![]() |
![]() |