ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఏపీకి కొత్తగా అతిపెద్ద ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Apr 14, 2025, 08:07 PM

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాజధాని అమరావతి కోసం రెండో దశ భూసమీకరణకు ప్రతిపాదనలు సిద్ధం చేస్తోంది. ప్రస్తుతం రాజధానిలో భూమికి సంబంధించి.. వివిధ అవసరాలకు పోగా రెండు వేల ఎకరాలే ఉంటుందట.. అదే సమయంలో భూముల కోసం వివిధ సంస్థల నుంచి వినతులు వస్తుండటంతో రెండో దశ భూ సమీకరణపై ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. అమరావతిలోని మరికొన్ని గ్రామాల రైతులు భూ సమీకరణలో భూములిచ్చేందుకు ఆసక్తిగా ఉండటంతో భూసమీకరణ ప్రారంభించేందుకు సీఆర్డీఏ సిద్ధమవుతోందని చెబుతున్నారు. రెండో దశలో మరో 30వేల ఎకరాలకు పైగా భూమిని సమీకరించాలని భావిస్తున్నారట.


అమరావతిలో ప్లాన్ చేయబోతున్న అంతర్జాతీయ విమానాశ్రయం ఏర్పాటుకే సుమారు 4 వేల ఎకరాలు కావాలని అంచనా వేస్తోందట ప్రభుత్వం. అమరావతిలో అంతర్జాతీయ విమానాశ్రయం ఏర్పాటుకు టీఈఎఫ్‌ఆర్‌ (సాంకేతిక, ఆర్థిక సాధ్యాసాధ్యాల నివేదిక) రూపొందించేందుకు ఏపీఏడీసీ (ఆంధ్రప్రదేశ్‌ విమానాశ్రయాల అభివృద్ధి సంస్థ) ఇప్పటికే టెండర్లు పిలిచిందని చెబుతున్నారు. అమరావతిలో అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ఎంఆర్‌వో సదుపాయం (నిర్వహణ, మరమ్మతులు, ఓవర్‌హాలింగ్‌), శిక్షణ కేంద్రాలతో సమీకృతంగా ఏర్పాటు చేయాలన్నది ప్రభుత్వ ఆలోచనగా ఉంది. అయితే ఈ అంతర్జాతీయ విమానాశ్రయానికి దాదాపు 4 వేల ఎకరాలు కావాలని అంచనా వేస్తుండగా.. ఈ ప్రాజెక్టు చేపట్టేందుకు ఒక ప్రముఖ సంస్థ ఇప్పటికే ఆసక్తికనబరిచినట్లు తెలుస్తోంది.


రాజధాని అమరావతి నిర్మాణానికి మరిన్ని భూములు అవసరం అవుతాయని ప్రభుత్వం అంచనా వేస్తోంది. భూ సమీకరణ విధానంలో భూములు ఇచ్చేందుకు రైతులు స్వచ్ఛందంగా ముందుకు వస్తుండటంతో భూసమీకరణ కోసం ప్రభుత్వం ప్రతిపాదనలు సిద్ధం చేస్తోంది. ఈ మేరకు ఎక్కువమంది రైతులు ముందుకొచ్చిన గ్రామాలతో మొదలుపెట్టి, దశలవారీగా భూ సమీకరణ చేయాలని ప్రభుత్వం భావిసత్ోంది. పలు సంస్థలు రాజధానిలో భూములు కావాలని కోరుతుండటంతో పాటుగా కేంద్ర ప్రభుత్వరంగ సంస్థల కార్యాలయాలు, పరిశోధన కేంద్రాల ఏర్పాటుకు కూడా భూములు అవసరం ఉంది అంటోంది ప్రభుత్వం.


అలాగే భవిష్యత్తులో అమరావతి, విజయవాడ, గుంటూరు, మంగళగిరి, తెనాలి ప్రాంతాలను కలిపి మెగాసిటీగా అభివృద్ధి చేయాలనే ప్రభుత్వం భావిస్తోంది. అలాగే అమరావతికి ఇన్నర్ రింగ్ రోడ్డుతో పాటుగా అవుటర్ రింగ్ రోడ్డును కూడా నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. దీంతో రాజధానిలో భూముల కోసం డిమాండ్ పెరుగుతోంది అంటున్నారు. అమరావతి చుట్టుపక్కల పెద్దగా ప్రభుత్వ భూములు లేవు అంటున్నారు.. అలాగే భూముల కోసం డిమాండ్‌లు పెరుగుతుండటంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. అలాగే సమీకరణలో భూములు ఇచ్చేందుకు స్వచ్ఛందంగా రైతులు ముందుకొస్తుండటంతో ప్రభుత్వం ఆ దిశగా కసరత్తు చేస్తోంది. ఏపీ ప్రభుత్వం అమరావతిని 'స్వయం అభివృద్ది' ప్రాజెక్టుగా ప్రకటించిన సంగతి కూడా తెలిసిందే.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com