ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఉగ్రవాదానికి ఎలాంటి మతం ఉండదు

national |  Suryaa Desk  | Published : Tue, Apr 29, 2025, 06:37 PM

పహల్గామ్ ప్రాంతంలో అమాయక పర్యాటకులపై జరిగిన ఉగ్రవాద దాడి ఘటన తీవ్ర కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఈ దారుణ సంఘటనపై దేశవ్యాప్తంగా తీవ్ర నిరసన వ్యక్తమవుతోంది. రాజకీయ, సినీ, వ్యాపార రంగాలకు చెందిన ప్రముఖులు ముక్తకంఠంతో ఈ దాడిని ఖండిస్తున్నారు. తాజాగా, ఈ ఘటనపై బాలీవుడ్ ప్రముఖ నటుడు ఇమ్రాన్ హష్మి తీవ్రంగా స్పందించారు.ఉగ్రవాదుల దాడిని తీవ్రంగా ఖండించిన ఇమ్రాన్ హష్మి... ఈ దుశ్చర్యకు పాల్పడిన వారు కచ్చితంగా తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. ఉగ్రవాదానికి ఎలాంటి మతం ఉండదని, దానిని ఏ మతంతోనూ ముడిపెట్టరాదని ఆయన అన్నారు. పర్యాటకులపై జరిగిన ఈ దాడి పక్కా ప్రణాళికతో జరిగిందని అభిప్రాయపడ్డారు. అమాయక ప్రజలను లక్ష్యంగా చేసుకుని జరిగిన ఈ దాడి పట్ల తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.పహల్గామ్ పర్యాటకులపై ఉగ్రవాదులు కాల్పులకు తెగబడటం దేశవ్యాప్తంగానే కాకుండా అంతర్జాతీయంగానూ విమర్శలకు దారితీసింది. పలు దేశాల అధినేతలు ఈ దాడిని ఖండించారు. మానవత్వంపై జరిగిన దాడిగా వారు అభివర్ణించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com