రాష్ట్రంలో యథేచ్ఛగా రెడ్బుక్ రాజ్యాంగం అమలవుతోందని, ఎక్కడికక్కడ అంతులేని అవినీతి జరుగుతోందని, వాటన్నింటినీ ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని వైయస్ఆర్సీపీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డి పిలుపునిచ్చారు. చంద్రబాబు ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందిందని, చంద్రబాబు చేస్తున్న విధ్వంసం అంతా ఇంతా కాదని, విద్య, వైద్యం, వ్యవసాయం ఇలా అన్ని రంగాల్లోనూ విధ్వంసమే కొనసాగుతోందని వైయస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ జిల్లా అధ్యక్షుల సమావేశంలో శ్రీ వైయస్ జగన్ గుర్తు చేశారు.రాష్ట్రంలో ఇప్పుడు చంద్రబాబు ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందింది. ఆయన చేస్తున్న విధ్వంసం అంతా ఇంతా కాదు. విద్య, వైద్యం, వ్యవసాయం ఇలా అన్ని రంగాల్లోనూ విధ్వంసమే కొనసాగుతోంది. ఈ పరిస్థితుల్లో మీ జిల్లాలో పార్టీ ఓనర్షిప్ మీదే. అందుకే ప్రజా సంబంధిత అంశాల్లో చొరవ చూపాలి. అంతేకానీ, ఒకరి ఆదేశాల కోసం ఎదురు చూడొద్దు. మీకు మీరుగా స్వచ్ఛందంగా కదలాలి. నియోజకవర్గ ఇన్ఛార్జిని స్వయంగా కలవాలి. అలా వారితో కలిసి మొదట కదలాల్సిందే మీరే అన్న విషయం గుర్తుంచుకొండి అని అన్నారు.
![]() |
![]() |