ట్రెండింగ్
Epaper    English    தமிழ்

తిరుమల తొక్కిసలాట ఘటనపై ముగియనున్న విచారణ

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Apr 16, 2025, 12:15 PM

తిరుమల తిరుపతి ఉత్సవాలలో జరిగిన తొక్కిసలాట ఘటనపై న్యాయ విచారణ ముగింపు దశకు వచ్చింది. వచ్చే నెల మొదటి వారంలో ప్రభుత్వానికి నివేదిక ఇచ్చే అవకాశం ఉన్నట్లు తెలిసింది. మంగళవారం కలెక్టరేట్‌లో జరిగిన 5వ దశ విచారణలో ఏకసభ్య న్యాయవిచారణ కమిషన్‌ చైర్మన్‌ జస్టిస్‌ సత్యనారాయణమూర్తి ఎదుట టీటీడీ తరపున దేవస్థానాల లా ఆఫీసర్‌(డీఎల్వో) వరప్రసాదరావు హాజరయ్యారు. ఘటనకు సంబంధించిన రికార్డులను కమిషన్‌కు అందజేశారు. ఇక జస్టిస్‌ సత్యనారాయణమూర్తి బుధవారం తిరుమల శ్రీవారి ఆలయంతోపాటు క్యూలైన్లను మరోసారి పరిశీలిస్తారు. చివరిగా విచారణకు హాజరు కావాలంటూ టీటీడీ ఈవోకు సమన్లు పంపనున్నట్లు తెలిసింది. భవిష్యత్తులో టీటీడీ ఆలయాల్లో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ముందస్తు జాగ్రత్తలు, సలహాలు, సూచనలతో.. రాష్ట్ర ప్రభుత్వానికి పూర్తిస్థాయి నివేదిక అందజేయనున్నట్లు తెలిసింది.


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com