తిరుమల శ్రీవారి ఆలయ పరిసర ప్రాంతంలో మంగళవారం డ్రోన్ ఎగరడం కలకలం రేపింది. అత్యంత పవిత్రమైన, భద్రతాపరంగా కీలకమైన ఈ ప్రాంతంలో డ్రోన్ కెమెరాను అధికారులు గుర్తించారు. దీనికి సంబంధించి రాజస్థాన్కు చెందిన ఓ యూట్యూబర్ను తిరుమల టీటీడీ విజిలెన్స్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. రాజస్థాన్కు చెందిన యూట్యూబర్ మంగళవారం దాదాపు పది నిమిషాల పాటు శ్రీవారి ఆలయ పరిసర ప్రాంతాల్లో డ్రోన్ కెమెరాను వినియోగించినట్లు తెలిసింది. అంతకుముందు, ఉదయం నుంచే ఆ వ్యక్తి తిరుమలలోని వివిధ ప్రదేశాలలో వీడియోలు చిత్రీకరిస్తున్నట్లు విజిలెన్స్ సిబ్బంది గుర్తించారు. డ్రోన్ గగనతలంలో ఎగురుతున్న విషయాన్ని గమనించిన టీటీడీ విజిలెన్స్ సిబ్బంది తక్షణమే స్పందించారు. ప్రస్తుతం యూట్యూబర్ ను విచారిస్తున్నామని, డ్రోన్ కెమెరా మెమరీ కార్డును స్వాధీనం చేసుకొని అందులోని దృశ్యాలను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నామని అధికారులు వెల్లడించారు.
![]() |
![]() |