సింగపూర్ స్కూల్లో ఈ నెల 8న జరిగిన అగ్ని ప్రమాదంలో గాయపడిన చిన్నారులను కాపాడిన భారత కార్మికులకు సింగపూర్ ప్రభుత్వం ‘లైఫ్ సేవర్’ అవార్డును ప్రదానం చేసింది. వారు తమ ప్రాణాలను పణంగా పెట్టి పిల్లలను రక్షించినందుకు గాను ఈ అవార్డును ప్రదానం చేసినట్టు సింగపూర్ సివిల్ డిఫెన్స్ ఫోర్స్ తెలిపింది. ఈ ప్రమాదంపై కార్మికులు మాట్లాడుతూ.. తాము చూసేసరికి గదిలో పిల్లలు భయంతో అరుస్తూ కనిపించారని తెలిపారు. కొందరు పిల్లలు మూడో అంతస్తు నుంచి దూకేయాలని కూడా చూశారన్నారు. వారితో మాట్లాడి దూకకుండా చూశామని, ఆ తర్వాత వారిని రక్షించి కిందికి తీసుకొచ్చామని వివరించారు. ఈ ప్రమాదంలో చనిపోయిన చిన్నారిని కాపాడలేకపోయినందుకు ఇప్పటికీ బాధపడుతున్నామని వివరించారు. కాగా, ఈ ప్రమాదంలో 15 మంది చిన్నారులు సహా 20 మంది గాయపడ్డారు.
![]() |
![]() |