విశాఖలో మేయర్ పై అవిశ్వాస తీర్మానంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నైతిక విజయం సాధించింది అని మాజీ ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ అన్నారు. అయన మాట్లాడుతూ.... సొంత బలం లేదు కాబట్టే అవిశ్వాస తీర్మానం కోసం కూటమి నాయకులు నెలరోజులు సమయం తీసుకున్నారు. అధికార బలంతో, డబ్బుందన్న అహంకారంతో స్పెషల్ ఫ్లైట్లు తీసుకుని ప్రజాధనాన్ని ఖర్చు చేశారు. ఎలాగైనా మేయర్ పీఠాన్ని కైవసం చేసుకోవాలన్న ఆశతో మా పార్టీ కార్పొరేటర్లపై రౌడీలు గూండాలతో బెదిరింపులకు దిగారు. డీజీపీ నుంచి కానిస్టేబుళ్ల వరకు అధికారాన్ని ఉపయోగించారు. అధికార పార్టీ అధ్యక్షుల నుంచి కార్యకర్త వరకు అన్ని వ్యవస్థలను వాడుకున్నారు. అయినా పార్టీకి అండగా నిలిచిన కార్పొరేటర్లకు మనసారా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. మలేసియాలో ఒక కార్పొరేటర్ మిస్ అయ్యారని తెలియగానే కూటమి నాయకులకు చెమటలు పట్టాయి. మేయర్గా బీసీ మహిళ ఉన్నా కూటమి పార్టీ నాయకులు ఓర్వలేకపోతున్నారు అని మండిపడ్డారు.
![]() |
![]() |