కేరళలోని కొట్టాయంలో ఓ దుండగుడు దంపతులను దారుణంగా హత్య చేశాడు. విజయకుమార్ (71), మీరా (65)భార్యాభర్తలు. తిరువాతుకల్లోని ఇంట్లో నివసించేవారు. ఈ క్రమంలో దంపతులిద్దరు దారుణహత్యకు గురయ్యారు. దుండగుడు అతికిరాతకంగా గొడ్డలితో నరికి చంపాడు. పని మనిషి చూసి పోలీసులకు సమాచారం అందించగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
![]() |
![]() |