రాష్ట్రంలో భయానక వాతావరణం సృష్టికి కూటమి సర్కార్ ప్రయత్నిస్తోందని వైయస్ఆర్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి మండిపడ్డారు. అక్రమాలు, అవినీతి ప్రజల్లోకి వెళ్లకుండా డైవర్షన్ పాలిటిక్స్కు తెర లేపారని ధ్వజమెత్తారు. ఐపీఎస్ అధికారి ఆంజనేయులు అరెస్టు దారుణమని ఆయన ఖండించారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో వైయస్ జగన్ నేతృత్వంలో పార్టీ పొలిటికల్ అడ్వైజరీ కమిటీ (పీఏసీ) సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ.... పొలిటికల్ అడ్వైజరీ కమిటీ (పీఏసీ) అనేది పార్టీలో అత్యున్నతమైనది. ఇందులో తీసుకునే నిర్ణయాలు పార్టీ దిశ, దశను నిర్ణయిస్తాయి. ఈ కమిటీ ప్రతి అంశం మీద పార్టీకి దిశానిర్దేశం చేస్తుంది. వివిధ అంశాల మీద సమగ్రంగా చర్చిస్తూ, పార్టీకి సూచనలు చేస్తుంది. అంతేకాక రాబోయే రోజుల్లో పార్టీ ఏం చేయాలన్న దానిపై కూడా తగిన ఆలోచనలు చేయడంతో పాటు, సలహాలు కూడా ఇస్తుంది. ఇకపై ప్రతినెలా కూడా పీఏసీ సమావేశం అవుతుంది అని తెలిపారు.
![]() |
![]() |