మాదకద్రవ్యాల వ్యాపారంలో ఒక విచిత్రమైన సంఘటన చోటుచేసుకుంది. తాను సరఫరా చేస్తున్న డ్రగ్స్ నాణ్యత బాగోలేదని వినియోగదారులు ఫిర్యాదు చేయడంతో, ఇంగ్లండ్ లోని ఒక డ్రగ్ డీలర్ వారికి క్షమాపణ చెప్పడమే కాకుండా, నష్టపరిహారంగా ఉచితంగా శాంపిల్స్ పంపిణీ చేశాడు. ఈ ఘటనకు సంబంధించి క్రిస్టోఫర్ డక్వర్త్ (30) అనే వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు.వివరాల్లోకి వెళితే, న్యూటన్ లీ విల్లోస్కు చెందిన క్రిస్టోఫర్ డక్వర్త్ 'డకీ' అనే పేరుతో హెరాయిన్, క్రాక్ కొకైన్ వంటి మాదక ద్రవ్యాలను విక్రయించేవాడు. గత ఏడాది వేసవిలో సెయింట్ హెలెన్స్లోని జంక్షన్ లేన్లో ఉన్న ఒక ఇంటి నుంచి డక్వర్త్ డ్రగ్స్ సరఫరా చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు.2023 జులై 29న అతడిని అదుపులోకి తీసుకుని సోదా చేయగా, 260 పౌండ్ల నగదు, రెండు మొబైల్ ఫోన్లు లభించాయి. అందులో ఒక ఫోన్కు డ్రగ్స్ కావాలంటూ నిరంతరం సందేశాలు వస్తూనే ఉన్నాయి.అతని ఫోన్లలోని సందేశాలను పరిశీలించగా, హెరాయిన్, క్రాక్ కొకైన్తో పాటు ప్రెగాబాలిన్ అనే మరో రకం డ్రగ్స్ను అమ్మకానికి పెట్టినట్లు తేలింది. అయితే, కొన్ని సందర్భాల్లో డ్రగ్స్ నాణ్యత, పరిమాణం సరిగా లేదని కొందరు వినియోగదారులు ఫిర్యాదు చేసినట్లు ప్రాసిక్యూటర్ ఇయాన్ క్రిడిల్ లివర్పూల్ క్రౌన్ కోర్టుకు తెలిపారు."ఇలాంటి ఫిర్యాదులపై డక్వర్త్ స్పందించాడు. నాణ్యత సరిగా లేనందుకు క్షమాపణ చెప్పి, పరిహారంగా తదుపరిసారి రెండు ప్యాకెట్లు అదనంగా ఉచితంగా ఇస్తానని వినియోగదారులకు చెప్పాడు" అని ప్రాసిక్యూటర్ వివరించారు. దీనిని బట్టి డక్వర్త్ కేవలం డ్రగ్స్ సరఫరా చేసే వ్యక్తి మాత్రమే కాదని, సరఫరా వ్యవస్థలో అతనికి కొంత బాధ్యత ఉందని అర్థమవుతోందని ప్రాసిక్యూటర్ పేర్కొన్నారు.మొదటిసారి అరెస్టయి విడుదలైన తర్వాత కూడా డక్వర్త్ తన కార్యకలాపాలు కొనసాగించాడు. రెండోసారి అరెస్టు చేసే సమయంలో, ఆధారాలు దొరక్కుండా ఉండేందుకు మొబైల్ ఫోన్లను ధ్వంసం చేయడానికి ప్రయత్నించాడు. లివర్పూల్ క్రౌన్ కోర్టులో విచారణ సందర్భంగా డక్వర్త్ పశ్చాత్తాపం వ్యక్తం చేస్తూ, "నేను మారాల్సిన అవసరం ఉంది" అని పేర్కొన్నాడు.
![]() |
![]() |