నిద్ర మనిషికి చాలా అవసరం. రోజూ కనీసం 8 గంటలు నిద్ర అవసరమని వైద్యులు కూడా సూచిస్తున్నారు. అయితే రాత్రి నిద్రపోయినా మధ్యాహ్నం కూడా ఓ గంట పాటు నిద్రపోవడం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిదని ఆరోగ్య నిపుణులు పేర్కొంటున్నారు. మధ్యాహ్నం భోజనం తర్వాత నిద్రపోవడం వల్ల మానసిక, శారీరక ఒత్తిడి దూరమవుతుందట. అలాగే జ్ఞాపకశక్తి పెరిగి, గుండె ఆరోగ్యం కూడా మెరుగుపడుతుందని వివరిస్తున్నారు.
![]() |
![]() |