: తెలంగాణ లో ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు మే 22వ తేదీ నుంచి 29వ తేదీ వరకు జరగనున్న సంగతి తెలిసిందే. ఈమేరకు తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డ్ సప్లిమెంటరీ పరీక్షల షెడ్యూల్ కూడా విడుదల చేసింది. ఆయా తేదీల్లో పరీక్షలు రోజుకు రెండు సెషన్లలో ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు.. అలాగే మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు జరగనున్నాయి. అంటే ఉదయం ఫస్ట్ ఇయర్ పరీక్షలు, మధ్యాహ్నం సెకండ్ ఇయర్ పరీక్షలు నిర్వహించేలా ప్రణాళిక రూపొందించారు. విద్యార్థులు ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల పూర్తి షెడ్యూల్ డైరెక్ట్ లింక్పై క్లిక్ చేసి చెక్ చేసుకోవచ్చు.
అలాగే.. ఈ సప్లిమెంటర్ హాల్టికెట్లు విడుదలయ్యాక అధికారిక వెబ్సైట్ https://tgbie.cgg.gov.in/ ద్వారా డౌన్లోడ్ చేసుకోవచ్చు. అయితే.. ఈ సప్లిమెంటరీ పరీక్షలు రాయాలనుకునే విద్యార్ధులకు తొలుత ఇచ్చిన ప్రకటన మేరకు ఫీజు చెల్లింపు గడువు ఏప్రిల్ 15 నుంచి 22 వరకు చెల్లించవచ్చని పేర్కొన్నారు. అయితే తాజాగా ఫీజు గడువును పొడిగిస్తూ ఇంటర్ బోర్డు ప్రకటన విడుదల చేసింది. సోమవారం (మే 5) వరకు ఫీజు చెల్లింపు గడువును పొడిగించినట్లు ఇంటర్మీడియట్ విద్యామండలి కార్యదర్శి కృతికా శుక్లా తెలిపారు. ఇప్పటి వరకు ఫీజులు చెల్లించని విద్యార్థులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని.. ఇదే చివరి అవకాశమని.. మరోసారి పొడిగింపు ఉండదని స్పష్టం చేశారు.
ఏప్రిల్ 22న విడుదలైన తెలంగాణ ఇంటర్ ఫలితాలు:
తెలంగాణ ఇంటర్మీడియట్ ఫలితాలు ఏప్రిల్ 22న విషయం తెలిసిందే. ఈ టీజీ ఇంటర్ ఫస్టియర్, సెకండియర్ రిజల్ట్స్ను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, విద్యాశాఖ అధికారులు విడుదల చేశారు. గతంతో పోలిస్తే ఈసారి మెరుగైనా ఫలితాలు వచ్చాయని.. తెలంగాణ ఫలితాల్లో ఈసారి కూడా బాలికలదే పైచేయిగా నిలిచిందని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క హర్షం వ్యక్తం చేశారు. ఇంటర్మీడియట్లో పాసైన విద్యార్థులకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి () శుభాకాంక్షలు తెలియజేశారని అన్నారు. ఈసారి ఇంటర్ ఫస్ట్ ఇయర్లో 66.89 శాతం, ఇంటర్ సెకండర్ ఇయర్లో 71.37 శాతం ఉత్తీర్ణత సాధించారు.
28 ప్రభుత్వ డిగ్రీ కాలేజీల్లో అప్రెంటిస్షిప్ కోర్సులు ప్రారంభం?
తెలంగాణలో డిగ్రీ ప్రవేశాలకు సంబంధించి దోస్త్ నోటిఫికేషన్ 2025 విడుదలైన విషయం తెలిసిందే. ఈక్రమంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 124 ప్రభుత్వ డిగ్రీ కాలేజీలు ఉన్నాయి. అందులో 28 కాలేజీల్లో వచ్చే విద్యాసంవత్సరం (2025-26) నుంచి అప్రెంటిస్షిప్ ఎంబెడెడ్ డిగ్రీ ప్రోగ్రాం (ఏఈడీపీ) పేరిట కొత్త కోర్సులను ప్రవేశపెట్టే దిశగా విద్యాశాఖ ప్రణాళిక రూపొందిస్తోంది.
ఇందులో బీకాం (బీఎఫ్ఎస్ఐ), ఈ-కామర్స్ ఆపరేషన్స్, రిటైల్ ఆపరేషన్స్, టూరిజం అండ్ హాస్పిటాలిటీ ఆపరేషన్స్, బీఎస్సీ ఇన్ ఫార్మాస్యూటికల్ మాన్యుఫ్యాక్చరింగ్ అండ్ క్వాలిటీ, బీబీఏ ఇన్ కంటెంట్ అండ్ క్రియేటివ్ రైటింగ్, బీఎస్సీ డిజిటల్, ఇండస్ట్రియల్ ఎలక్ట్రానిక్స్, బీఎస్సీ మార్కెటింగ్ అండ్ సేల్స్ కోర్సులు ఉన్నాయి. విద్యార్ధులకు నైపుణ్యాలు నేర్పి, ఉద్యోగ ఉపాధి అవకాశాలు సమృద్ధిగా పెంపొందించడమే లక్ష్యంగా ఈ కోర్సులను తీసుకువస్తున్నట్లు పేర్కొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa