ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ప్రముఖ పారిశ్రామికవేత్తలపై స్పందించిన సుందర్ పిచాయ్

national |  Suryaa Desk  | Published : Mon, May 19, 2025, 04:47 PM

ఏఐ ఆధిపత్యం కోసం దిగ్గజ సంస్థల మధ్య పోటీ రోజురోజుకు తీవ్రమవుతోంది. ఈ క్రమంలో, మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల గతంలో చేసిన "గూగుల్‌ను డ్యాన్స్ చేయిస్తాం" అన్న వ్యాఖ్యలపై గూగుల్, ఆల్ఫాబెట్ సీఈఓ సుందర్ పిచాయ్ మరోసారి తనదైన శైలిలో స్పందించారు. 'ఆల్-ఇన్' పాడ్‌కాస్ట్‌లో పాల్గొన్న ఆయన, ఏఐ పోటీ వాతావరణం మరియు ప్రత్యర్థి సంస్థల అధినేతల గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఏఐ రంగంలో ప్రముఖ కంపెనీల అధినేతలైన సామ్ ఆల్ట్‌మన్ (ఓపెన్‌ఏఐ), ఎలాన్ మస్క్ (ఎక్స్‌ఏఐ), మార్క్ జుకర్‌బర్గ్ (మెటా), సత్య నాదెళ్ల (మైక్రోసాఫ్ట్) వంటి వారి గురించి ప్రశ్నించగా, సుందర్ పిచాయ్ వారి ప్రతిభను కొనియాడారు. "వీరంతా గొప్ప పారిశ్రామికవేత్తలు. వారి వల్లే మరిన్ని ఆవిష్కరణలు సాధ్యమవుతాయి" అని అన్నారు. అనంతరం, "వారందరితో నాకు పరిచయం ఉండటం నా అదృష్టం. వారిలో ఒకరు మాత్రమే నన్ను 'డ్యాన్స్‌'కు ఆహ్వానించారు... మిగతావారు కాదు," అంటూ సత్య నాదెళ్ల వ్యాఖ్యలను ఉద్దేశిస్తూ చమత్కరించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com