ట్రెండింగ్
Epaper    English    தமிழ்

జూన్ 14న విడుదల కానున్న ఏపీ ఈఏపీ సెట్-2025 ఫలితాలు

Education |  Suryaa Desk  | Published : Fri, May 30, 2025, 02:18 PM

రాష్ట్రంలో నిర్వహించిన ఈఏపీ సెట్ (EAPCET-2025) పరీక్ష ఫలితాలను జూన్ 14న విడుదల చేసే అవకాశముంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉన్నత విద్యామండలి (APSCHE) ఆధ్వర్యంలో ఈ పరీక్ష నిర్వహించబడినది.
ఈ ఏడాది మొత్తం 3,62,429 మంది అభ్యర్థులు దరఖాస్తు చేయగా, అందులో 2,64,840 మంది ఇంజినీరింగ్ విభాగానికి, 75,460 మంది అగ్రికల్చర్, ఫార్మసీ విభాగాలకు హాజరయ్యారు. ఇప్పటికే అగ్రికల్చర్ మరియు ఫార్మసీ విభాగాలకు సంబంధించిన ప్రిలిమినరీ ఆన్సర్ కీ విడుదల కాగా, తాజాగా ఇంజినీరింగ్ విభాగానికి సంబంధించిన ఆన్సర్ కీ కూడా విడుదలైంది.
పరీక్షకు హాజరైన అభ్యర్థులు తమ సమాధానాలు అధికారిక వెబ్‌సైట్‌ అయిన https://cets.apsche.ap.gov.in ద్వారా చెక్ చేసుకోవచ్చు. ఫలితాల విడుదల అనంతరం ర్యాంకులు, కౌన్సెలింగ్ తేదీలు తదితర వివరాలను కూడా అదే వెబ్‌సైట్‌ ద్వారా పొందవచ్చు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa