ఆంధ్రప్రదేశ్లో అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం.. ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించిన తల్లికి వందనం పథకాన్ని మూడు రోజుల క్రితమే ప్రారంభించింది. జూన్ 12న పథకాన్ని ప్రారంభించగా.. టెక్నికల్ సమస్య వల్ల మరుసటి రోజు నుంచి నిధుల జమ అయ్యాయి. కుటుంబంలో ఎంత మంది పిల్లలున్నా సరే అందరికి తల్లికి వందనం నిధులు జమ చేస్తామని ప్రభుత్వం తెలిపింది. ఈ క్రమంలో తాజాగా ఈ పథకంపై ఆంధ్రప్రదేశ్ పాఠశాల విద్యాశాఖ కీలక ప్రకటన చేసింది. తల్లికి వందనం పథకం ఎవరికి వర్తిస్తుంది.. ఎవరికి వర్తించదో తెలిపే జాబితాను సంబంధిత గ్రామ సచివాలయాల్లో ప్రదర్శిస్తున్నామని.. ప్రతి ఒక్కరు దాన్ని చెక్ చేసుకోవాలని విద్యాశాఖ అధికారులు సూచించారు.
తల్లికి వందనం పథకం అమల్లో భాగంగా అర్హులైన లబ్ధిదారుల తల్లుల ఖాతాల్లో ఇప్పటికే నగదు జమ చేశారు. అలానే అర్హత ఉండి నిధులు జమ కాని వారు.. గ్రామ సచివాలయ శాఖ వెబ్ సైట్కు వెళ్లి తిరిగి దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచించారు. వీటిని పరిశీలించి.. అర్హులో కాదో తేల్చిన తర్వాత వారికి కూడా నిధులు జమ చేస్తామని వెల్లడించారు. అలానే తల్లిదండ్రులు లేని పిల్లలకు సంబంధించి.. తల్లికి వందనం నిధులను ముందుగా సంబంధిత జిల్లా కలెక్టర్ ఖాతాలో జమ చేస్తారని అధికారులు తెలిపారు. ఆ తర్వాత సదరు విద్యార్థుల వివరాలను పూర్తిస్థాయిలో పరిశీలించి.. ఆ తర్వాత వారికి తల్లికి వందనం నగదు అందజేస్తామన్నారు.
అలానే ఆరుగురు, అంతకంటే ఎక్కువ మంది సంతానం కలిగిన తల్లుల వివరాలను మరోసారి పరిశీలించిన తర్వాత.. వారికి కూడా తల్లికి వందనం నగదు విడుదల చేస్తామన్నారు. కూటమి ప్రభుత్వం ఎన్నికల వేళ చెప్పినట్లుగానే.. ఒక తల్లికి ఎంతమంది పిల్లలున్నా సరే వారందరికీ తల్లికి వందనం నిధులు అందజేస్తామనే మాటకు కట్టబడి ఉందని అధికారులు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్లో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం పేద పిల్లలు చదువుకు ఆర్థిక భారం అడ్డంకి కాకూడదనే భావించి.. తల్లికి వందనం పథకం ద్వారా వారికి ఆర్థికసాయం చేస్తోంది. ఈ పథకం కింద అర్హులైన ప్రతి విద్యార్థికి ఏటా రూ. 15,000 ఆర్థిక సహాయం అందిస్తున్నారు. ప్రైవేట్ స్కూళ్లలో చదివే వారికి కూడా ఈ పథకం వర్తిస్తుంది. అలానే కుటుంబంలో ఎంత మంది పిల్లలుంటే.. వారందరికి తల్లికి వందనం నిధులు అందిస్తారు. తల్లికి వందనం కింద ఇచ్చే రూ.15 వేలలో విద్యార్థికి రూ.13,000 ఇచ్చి.. మిగతా రెండు వేల రూపాయలను పాఠశాల/ కాలేజీ నిర్వహణ (అభివృద్ధి)కి కేటాయిస్తున్నారు.
![]() |
![]() |
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa