ట్రెండింగ్
Epaper    English    தமிழ்

శ్రీశైలం ఆలయం వద్ద బాంబులు, బుల్లెట్లు.. ఎవరివో తెలిసిపోయింది

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Jun 24, 2025, 08:36 PM

ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రం శ్రీశైలంలో సోమవారం బుల్లెట్లు, బాంబుల కలకలం రేగిన సంగతి తెలిసిందే. అయితే అవి ఎవరివి.. బుల్లెట్లు, బాంబులను ఎవరు శ్రీశైలం ఆలయం సమీపంలో ఉంచారనే దానిపై క్లారిటీ వచ్చింది. దీనికి సంబంధించిన వివరాలను ఆత్మకూరు డీఎస్పీ రామాంజినాయక్ వెల్లడించారు. శ్రీశైలం ఆలయం సమీపంలో దొరికిన బుల్లెట్లు పోలీసులవేనని తేలింది. ఇదే విషయాన్ని ఆత్మకూరు డీఎస్పీ రామాంజినాయక్ వెల్లడించారు. తమ దర్యాప్తులో ఈ బుల్లెట్లు పోలీస్ విభాగానికి చెందినవని తేలిందని రామాంజినాయక్‌ సోమవారం రాత్రి వెల్లడించారు.


ప్రముఖ శైవక్షేత్రం శ్రీశైలం ఆలయం సమీపంలో సోమవారం బుల్లెట్లు, బాంబులు లభ్యం కావడం తీవ్ర కలకలం రేపింది. శ్రీశైలంలోని వాసవీ సత్రం ఎదురుగా ఉండే రోడ్డు డివైడర్‌ మీద ఉన్న మొక్కల మధ్యలో సోమవారం ఓ సంచి కనిపించింది. కూలీలు ఈ విషయాన్ని గమనించి పోలీసులకు చేరవేశారు. పోలీసులు బాంబ్ స్క్వాడ్‌తో పాటుగా ఘటనాస్థలికి చేరుకుని.. ఆ సంచిని స్వాధీనం చేసుకున్నారు. అందులో బుల్లెట్లు ఉన్నట్లు గుర్తించారు. అలాగే వంకాయ బాంబుల తరహాలో ఉన్నవి 4 సంచిలో లభించాయి. వీటితో పాటుగా ఒక ఎర్రటి వస్త్రం దొరికింది. పోలీసులు వీటిని స్వాధీనం చేసుకుని పోలీసుస్టేషన్‌కు తరలించారు.


శ్రీశైలం పుణ్య క్షేత్రంలో బుల్లెట్ల కలకలం..


ఎలా వచ్చాయంటే?


1983 బ్యాచ్‌కు చెందిన ఎల్లప్ప అనే పోలీసుకు.. అధికారులు శ్రీశైలంలో విధులు అప్పగించారు. అయితే ఎల్లప్ప తనకు కేటాయించిన బుల్లెట్లను సంచిలో వేసుకుని శ్రీశైలం చేరుకున్నారు. రోడ్డు డివైడర్ వద్ద ఫోన్ మాట్లాడుతూ ఎల్లప్ప ఆ సంచిని డివైడర్ మధ్యలో మర్చిపోయినట్లు డీఎస్పీ వివరించారు. అయితే ఎల్లప్ప భయపడిపోయి ఈ విషయాన్ని రహస్యంగా ఉంచారని వివరించారు.


 







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa