ఎయిర్ కండిషనర్ల (ఏసీ) వినియోగం విషయంలో కేంద్ర ప్రభుత్వం సరికొత్త నిబంధనలు తీసుకురానుందని ఇటీవల కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి మనోహర్ లాల్ తెలిపారు. దీంతో ఇకపై కొత్త ఏసీల్లో ఉష్ణోగ్రత పరిమితులు మారనున్నాయని చెప్పారు. కనిష్టంగా 20 డిగ్రీ సెంటిగ్రేడ్ .. గరిష్టంగా 28 డిగ్రీ సెంటిగ్రేడ్ పరిమితి విధించనున్నట్లు వెల్లడించారు. దీనివల్ల విద్యుత్ వినియోగం తగ్గడంతో పాటు వినియోగదారులకు వేలల్లో డబ్బు ఆదా అవుతుందని కేంద్ర మంత్రి. అయితే దీనిపై కేంద్ర ప్రభుత్వం వెనకడుగు వేసినట్లు తెలుస్తోంది. ఈ పరిమితులు ఇప్పట్లో విధించే అవకాశం లేదని తాజాగా కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి భూపేంద్ర యాదవ్ అన్నారు.
ఏసీలకు కనిష్ఠంగా 20 డిగ్రీల సెంటిగ్రేడ్, గరిష్ఠ 28 డిగ్రీల సెంటిగ్రేడ్ లిమిట్స్ విధించబోతున్నామంటూ కేంద్రమంత్రి మనోహర్లాల్ ఖట్టర్ కొన్ని రోజుల క్రితం తెలిపారు. ఈ క్రమంలో వాతావరణ సదస్సుకు హాజరైన మంత్రి భూపేంద్ర యాదవ్ ఈ ప్రశ్న ఎదురైంది. అయితే ఏసీలపై పరిమితులను ఇప్పటికిప్పుడు విధించే అవకాశం లేదని తెలిపారు. ఈ విధాననాన్ని దశలవారీగా అమలు చేయాల్సిన ఉంటుందని వెల్లడించారు. బహుశా 2050 తర్వాత ఇలాంటి పరిస్థితులు ఎదురుకావచ్చని భూపేంద్ర యాదవ్ అన్నారు. ఈ సందర్భంగా మాట్లాడని ఆయన.. అభివృద్ధి చెందిన దేశాలకు చురకలు అంటించారు. ఆ దేశాలు ఇప్పటికే పర్యావరణానికి చాలా నష్టం చేకూర్చాయని అన్నారు.
ఇటీవల కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి మనోహర్లాల్ ఖట్టర్ ప్రకటించారు. ఈ మార్పుతో వినియోగదారులకు మూడు సంవత్సరాల్లో రూ.18,000 నుంచి రూ.20,000 కోట్ల వరకు ఆదా అవుతుందని తెలిపారు. ఇది ఒక ప్రత్యేక ప్రయోగం అని ఆయన వెల్లడించారు. ఈ కొత్త నిబంధనల వల్ల ఏసీల పనితీరు మెరుగుపడుతుందని చెప్పారు. వేసవిలో విద్యుత్ డిమాండ్, కరెంటు బిల్లులు తగ్గుతాయని పేర్కొన్నారు. ఈ కొత్త నిబంధనలు దేశవ్యాప్తంగా.. ఇళ్లలో, కార్యాలయాల్లో, మాల్స్, హోటల్స్, సినిమా థియేటర్లలో వాడే అన్ని ఏసీలకుఏసీలకు వర్తిస్తాయని తెలిపారు.
మనోహర్ లాల్ వ్యాఖ్యల వల్ల దీనిపై పెద్ద ఎత్తున చర్చ జరిగింది. 2018లో బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియెన్సీ అధ్యయన చేసింది. దాని ప్రకారం చాలా వరకు ఏసీలు 20-21 డిగ్రీల మధ్యే నడుస్తున్నాయని తేల్చింది. నిజానికి ఏసీ 24-25 డిగ్రీల మధ్య ఉపయోగిస్తే ఆ మేర విద్యుత్ ఆదా అవుతుందని పేర్కొంది. 2020లో ప్రభుత్వం ఏసీలకు 24 డిగ్రీల ఉష్ణోగ్రతను డిఫాల్ట్ సెట్టింగ్గా నిర్ణయించింది. 26-27 డిగ్రీల ఉష్ణోగ్రత వద్ద ఏసీలను వాడాలని సూచించింది. ఇది ఆరోగ్యానికి మంచిదని తెలిపింది.
ప్రభుత్వ లెక్కల ప్రకారం.. ఏసీ కూలింగ్ ఉష్ణోగ్రతను 1 డిగ్రీ పెంచితే 6 శాతం విద్యుత్ ఆదా అవుతుంది. 6 కోట్ల పట్టణ గృహాలు, 12 లక్షల వ్యాపార సంస్థలు ఏసీ ఉష్ణోగ్రతను 22 నుంచి 24 డిగ్రీల మధ్య ఉంచితే.. ఏటా 12-15 బిలియన్ యూనిట్ల విద్యుత్ ఆదా అవుతుంది. దీనివల్ల 4-5 బొగ్గు ఆధారిత విద్యుత్ ప్లాంట్లు నిర్మించాల్సిన అవసరం ఉండదు. ఫలితంగా కార్బన్ ఉద్గారాలు కూడా తగ్గుతాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa