ట్రెండింగ్
Epaper    English    தமிழ்

'సుపరిపాలనలో తొలి అడుగు' అనే కార్యక్రమాన్ని ప్రారంభించిన బోండా ఉమా

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Jul 02, 2025, 03:22 PM

ఎన్నికల్లో హామీ ఇచ్చిన విధంగా అన్ని సంక్షేమ ‌పథకాలను ప్రభుత్వం అమలు చేస్తోందని విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ తెలుగుదేశం ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు ఉద్ఘాటించారు. ఇవాళ(బుధవారం) సుపరిపాలనలో తొలి అడుగు పేరుతో ఇంటింటికీ వెళ్లి ప్రజల అభిప్రాయాలను ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు అడిగి తెలుసుకున్నారు. ప్రజలను కలిసి వారి సమస్యల గురించి అడిగి తెలుసుకున్నారు. స్థానికంగా ఉన్న డ్రైనేజి, ఇతర సమస్యలు వెంటనే పరిష్కారించాలని అధికారులకు బోండా ఉమ సూచించారు. ఈ సందర్భంగా బోండా ఉమ మీడియాతో మాట్లాడారు.కూటమి ప్రభుత్వం ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా ఇంటింటికీ వెళ్లి ప్రజలను కలవాలని సీఎం చంద్రబాబు ఆదేశించారని బోండా ఉమామహేశ్వరరావు చెప్పుకొచ్చారు. నేటి నుంచి సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమాన్ని ప్రారంభించి నెల రోజుల‌పాటు నిర్వహిస్తామని వెల్లడించారు. 267 పోలింగ్ స్టేషన్ల పరిధిలో తమ నియోజకవర్గంలో ప్రజల మధ్య తాము ఉన్నామని చెప్పారు. మై టీడీపీ యాప్ ద్వారా ప్రజల సమస్యలు తెలుసుకుని వెంటనే పరిష్కారం అయ్యేలా అధికారులు చర్యలు చేపడుతున్నారని అన్నారు. ప్రజల సంతృప్తి స్థాయి పెంచి, జవాబుదారీతనంతో ఉంటామని ఉద్ఘాటించారు. అధికారం‌లో ఉన్నా లేకున్నా.. తాము ఎప్పుడూ ప్రజల ముందుకు వస్తూనే ఉన్నామని తెలిపారు. రూ. 240 కోట్లతో సెంట్రల్ నియోజకవర్గంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని స్పష్టం చేశారు. మహిళలకు ఉచిత బస్సు పథకం, స్త్రీ నిధిని ఈ ఏడాది ఆగస్టు నుంచి అమలు చేస్తామని ప్రకటించారు. ఎన్నికల ముందు ఇచ్చిన ప్రతి హామీ గుర్తు ఉందని, తప్పకుండా అమలు చేసి తీరుతామని స్పష్టం చేశారు. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa