ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పాకిస్థాన్‌లోని లాహోర్ నగరంలో ఒక షాకింగ్ ఘటన చోటుచేసుకుంది

international |  Suryaa Desk  | Published : Sat, Jul 05, 2025, 08:27 AM

పాకిస్థాన్‌లోని లాహోర్ నగరంలో ఒక షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. ఇంటి నుంచి తప్పించుకున్న ఓ పెంపుడు సింహం వీధిలో వెళ్తున్న వారిపై దాడికి తెగబడింది. ఈ ఘటనలో ఒక మహిళ, ఆమె ఇద్దరు పిల్లలు గాయపడ్డారు. గురువారం రాత్రి జరిగిన ఈ దాడికి సంబంధించిన సీసీటీవీ ఫుటేజీని పోలీసులు విడుదల చేయగా, అది ఇప్పుడు వైరల్‌గా మారింది. లాహోర్‌లోని ఓ రద్దీ వీధిలో 11 నెలల వయసున్న పెంపుడు సింహం తన ఇంటి గోడ దూకి బయటకు వచ్చింది. ఆ సమయంలో షాపింగ్ చేసుకుని వస్తున్న ఓ మహిళను వెంబడించి, ఆమెపైకి దూకి కింద పడేసింది. అనంతరం ఆమెతో పాటు ఉన్న ఐదు, ఏడేళ్ల పిల్లలపై పంజా విసిరింది. ఈ దాడిలో వారి ముఖాలు, చేతులపై గాయాలయ్యాయి. బాధితులను వెంటనే ఆసుపత్రికి తరలించగా, వారి పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు.ఈ ఘటన జరుగుతున్నప్పుడు సింహం యజమానులు ఇంటి నుంచి బయటకు వచ్చి దాడిని చూస్తూ వినోదించారని బాధితురాలి భర్త పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఘటన అనంతరం యజమానులు సింహంతో పాటు అక్కడి నుంచి పరారయ్యారు. అయితే, పోలీసులు 12 గంటల్లోనే ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసి, సింహాన్ని స్వాధీనం చేసుకున్నారు. దాన్ని ఓ వన్యప్రాణుల సంరక్షణ కేంద్రానికి తరలించారు.పాకిస్థాన్‌లోని పంజాబ్ ప్రావిన్స్‌లో హోదా, అధికారానికి చిహ్నంగా సింహం వంటి వన్యప్రాణులను పెంచుకోవడం సర్వసాధారణంగా మారింది. గత ఏడాది డిసెంబర్‌లో ఇలాంటి ఘటనే జరగ్గా, ప్రభుత్వం వీటి పెంపకంపై కఠిన నిబంధనలు తీసుకొచ్చింది. లైసెన్సులు తప్పనిసరి చేయడంతో పాటు నివాస ప్రాంతాల్లో వీటిని ఉంచడాన్ని నిషేధించింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa